వామ్మో… లోకేశ్ కోసం బాబు ఇంత చేశాడా..?

టీడీపీ పార్టీ నేతల్లో, పార్టీ కార్యకర్తల్లో లోకేశ్ పై ఉన్న అభిప్రాయం గురించి మనందరికీ తెలిసిందే. లోకేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పడం అసాధ్యమని… లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేశ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం కాదని చంద్రబాబుకు కీలక నేతలు సూచిస్తున్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం లోకేశ్ తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. Also Read : వైసీపీ ఎమ్మెల్యేకు […]

Written By: Navya, Updated On : September 19, 2020 9:51 am
Follow us on

టీడీపీ పార్టీ నేతల్లో, పార్టీ కార్యకర్తల్లో లోకేశ్ పై ఉన్న అభిప్రాయం గురించి మనందరికీ తెలిసిందే. లోకేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పడం అసాధ్యమని… లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేశ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం కాదని చంద్రబాబుకు కీలక నేతలు సూచిస్తున్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం లోకేశ్ తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు.

Also Read : వైసీపీ ఎమ్మెల్యేకు కోర్టు షాక్… కేసు పెట్టాలని ఆదేశాలు..?

జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని పలువురు నేతలు సూచించినా నందమూరి వారసులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే లోకేశ్ పార్టీకి పూర్తిగా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీ నేతలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేని లోకేశ్ భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలడని… లోకేశ్ కు బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే తాజాగా బాబు నవ్యాంధ్రలో ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో లోకేశ్ కోసం క్షుద్రపూజలు చేయించారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయమైన ఘటన వైసీపీ కంటే టీడీపీనే టెన్షన్ పెడుతోంది. ఆలయ చైర్మన్ సోమినాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. టీడీపీ హయాంలో సింహాల బొమ్మలు మాయమై ఉండొచ్చని… గతంలో దుర్గ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ తల్లి భువనేశ్వరి అప్పటి ఆలయ ఈవోతో మాట్లాడి పూజలు చేయించారని అన్నారు. లోకేష్ రాజకీయ భవిష్యత్ కొరకు ఈ పూజలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి వెళ్లి లోకేశ్ సీఎం కావాలని పూజలు చేయించారని అన్నారు. దీంతో లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు ఇంత చేశాడా….? అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?