ఆంధ్రప్రదేశ్‌Chandrababu:చంద్రబాబు బలం.. బలహీనత వాళ్లే..

Chandrababu:చంద్రబాబు బలం.. బలహీనత వాళ్లే..

Chandrababu : అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన యాక్టివ్ గా ఉంటారు.. ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ.. ప్రతిపక్షంగా ఆందోళన చేయడంలోనూ ఆయనది సెపరేట్ రూట్.. అలా నిత్యయవ్వనుడిగా కనిపించే చంద్రబాబుకు బలం.. బలహీనత కార్యకర్తలే. చంద్రబాబు ఏస్థాయిలో ఉన్నా కార్యకర్తలు ఆయన వెంట ఉంటారు. అధికారంతో సంబంధం లేకుండా బాబు కోసం ఏమైనా చేయడానికి ముందుంటారు. అయితే అంతలా తమ అధినేత కోసం తపించే కార్యకర్తలను బాబు పట్టించుకోవడం లేదా..? వారి బాగోగులు చూడడం లేదా..? అని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.

Chandrababu

40 ఏళ్ల రాజకీయ జీవింతంలో చంద్రబాబు ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొన్నారు. సక్సెస్ కూడా సాధించారు. రాజకీయ జీవితంలో బాబు సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా అందుకు కారణం టీడీపీ కార్యకర్తలే అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఏమైనా చేయగలే కరుడు కట్టిన కార్యకర్తలున్నారు. మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీలో కింది క్యాడర్ ఎక్కువగా.. బలంగా ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వారి వారు చేస్తారు. పార్టీ అధినేతను నమ్ముకొని ముందుకు సాగుతారు.

అయితే అధికారంలో ఉన్నప్పుడు బాబుకు కార్యకర్తలు కనిపించరు. ఎంతసేపు బడా నాయకుల గురించే ఆలోచించే బాబు కింది కేడర్ ను పట్టించుకోలేదు. దీంతో గత ఎన్నికల్లో బాబు ఓడిపోవడానికి కార్యకర్తలేకారణమని కొందరు అంటారు. పార్టీ కోసం పరితపించి వారికి అధికారంలో ఉన్నప్పుడు కనీస న్యాయం జరగలేదు. చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా వారికి దక్కకుండా చేశారు. దీంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక విపక్షంలో ఉన్నప్పడు ఎలా న్యాయం చేస్తారు..? అయితే కొందరు మాత్రం పార్టీ కోసం లక్షల రూపాయలైనా ఖర్చేచేయడానికి వెనుకాడరు.

2019 ఎన్నికల్లో కొందరు పార్టీ కార్యకర్తలు తమ సొంత డబ్బులను ఖర్చు పెట్టీ మరీ పార్టీ కోసం ప్రచారం చేశారు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో వారు తీవ్రంగా నష్టపోయారు. వారి గురించి పట్టించుకునే వారు లేదు. అయితే ఇటీవల చంద్రబాబు ఇటీవల రియలైజ్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ బలంగా ఉండడానికి కార్యకర్తలే కారణమని, వారిని నెత్తిన పెట్టుకుంటానని ప్రసంగించారు. ఇన్నేళ్లకైనా కార్యకర్తల గురించి ఆలోచించిన బాబు ఇక ముందు కూడా వారి గురించి ఆలోచిస్తే పార్టీకి న్యాయం చేస్తారని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Kesineni Nani: చంద్రబాబు ఓకే.. టిడిపిలోకి ఆ మాజీ ఎంపీ?!

Kesineni Nani: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన చాలామంది టిడిపి నేతల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే గత ఎన్నికలకు ముందు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు....

Nara Lokesh : ‘మనవాళ్లే అయినా ఉపేక్ష లేదు’.. గుంటూరు ఘటనలో నారా లోకేష్ ఇచ్చిన బలమైన సంకేతం!

Nara Lokesh : గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మహిళల భద్రత, రాజకీయ నాయకుల బాధ్యత, అధికార పార్టీ వైఖరి వంటి అంశాలపై ఈ ఘటన...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version