కష్టకాలం.. సొంత నిర్ణయాలు వద్దు:కేంద్రం

నేటి నుంచి రెస్టారెంట్లకు, బస్సు సర్వీసులకు అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. అత్యవసరం కాని సేవలకు అనుమతివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్ డౌన్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లాక్‌ డౌన్‌ అమలు విషయంలో […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 11:54 am
Follow us on

నేటి నుంచి రెస్టారెంట్లకు, బస్సు సర్వీసులకు అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. అత్యవసరం కాని సేవలకు అనుమతివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

దేశ వ్యాప్తంగా ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్ డౌన్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లాక్‌ డౌన్‌ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం సరికాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ ద్వారా తెలిపారు. అత్యవసరం కాని సేవలు, కార్యకలాపాలకు పలు రాష్ట్రాలు అనుమతిస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు. దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి లాక్ డౌన్ లో కొన్ని సేవలకు సడలింపు ఇచ్చిందన్నారు.

దేశమంతా విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు పాటించాలని ఆదేశించిన కేంద్ర హోంశాఖ.. రాష్ట్రాలు అనుసరించాల్సిన వైఖరిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేసింది. ఎవరికి వారి నిర్ణయాల వల్ల దేశమంతా నష్టపోయే పరిస్థితి రాకూడదని హెచ్చరించింది.