సీసీఎంబి అందుబాటులోకి తేనున్న కోవిద్-19 నిర్ధారణ కిట్

మొత్తం దేశాన్ని కలవరానికి గురిచేస్తున్న కోవిద్-19 రోగాన్ని నిర్ధారణ చేసే కిట్లు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కిట్ లు సహితం అత్యాధునికమైనవి కావు. దానితో నాణ్యమైన కిట్ ల విడుదలకు హైదరాబాద్ కేంద్రంగా గల ప్రముఖ భారతీయ బయో-టెక్నాలిజీ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి) సన్నాహాలు చేస్తున్నది. తక్కువ ధరలో, ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేసే వీటిని అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు, మూడు […]

Written By: Neelambaram, Updated On : March 25, 2020 5:29 pm
Follow us on

మొత్తం దేశాన్ని కలవరానికి గురిచేస్తున్న కోవిద్-19 రోగాన్ని నిర్ధారణ చేసే కిట్లు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కిట్ లు సహితం అత్యాధునికమైనవి కావు. దానితో నాణ్యమైన కిట్ ల విడుదలకు హైదరాబాద్ కేంద్రంగా గల ప్రముఖ భారతీయ బయో-టెక్నాలిజీ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి) సన్నాహాలు చేస్తున్నది.

తక్కువ ధరలో, ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేసే వీటిని అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు, మూడు వారాలలో అందించగలమని ప్రకటించింది.

“మేము మా అనుబంధ సంస్థలకు సహాయం చేస్తున్నాము; వారు ఆలోచనలతో బయటకు వచ్చారు. మేము వారికి మద్దతు ఇస్తున్నాము. వారు ప్రతిపాదించిన డయాగ్నొస్టిక్ కిట్‌లను మేము పరీక్షిస్తున్నాము. ధృవీకరిస్తున్నాము. మేము కొన్ని మంచి వస్తు సామగ్రితో రావచ్చు” అని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ ఆర్ కె మిశ్రా వెల్లడించారు.

ప్రస్తుతం రూ 1,000 కన్నా తక్కువకే రోగనిర్ధారణ జరిగేటట్లు ద్రుష్టి సారిస్తున్న సిసిఎంబి రూ 400-500 చౌకైన కిట్ల గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ప్రామాణికత, ఖచ్చితత్వంకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సివిఎంబి కూడా కోవిడ్ -19 వైరస్ కల్చర్ చేయడానికి పైసా యోచిస్తోంది. వారికి తగు సౌకర్యాలు ఉన్నాయని, వారికి ప్రభుత్వం నుండి కూడా ఆమోదాలు వచ్చాయని, అయితే కల్చర్ ను ప్రారంభించడానికి వారికి ఇంకా నమూనా, వస్తు సామగ్రి లభించలేదని డా. మిశ్రా చెప్పారు.

“ఈ సమయంలో, మా సౌకర్యాలు సెట్ చేయబడ్డాయి. వాస్తవానికి నగరంలోని ఇతర గుర్తింపు పొందిన ప్రదేశాలలో పరీక్ష కోసం వెళ్లే వ్యక్తులకు మేము శిక్షణ ఇస్తున్నాము” అని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రభుత్వ నియమించబడిన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో వెళ్లి పరీక్షలు చేయగలిగేలా 25 మందికి సిసిఎంబి శిక్షణ ఇచ్చింది.