Kishan Reddy: ఇవీ మేమిచ్చినవి.. కేసీఆర్ ఏం చేశావో చెప్పు?: కిషన్ రెడ్డి

Kishan Reddy: మాట్లాడితే కేంద్రం తెలంగాణకు నిధుల ఇవ్వడం లేదని చెప్పే సీఎం కేసీఆర్ కు సూటిగా పలు ప్రశ్నలు సంధించాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పి మరీ కడిగేశారు. బండి సంజయ్ 3వ విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా జేపీ నడ్డాతోపాటు కిషన్ రెడ్డి కూడా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ కు ఎప్పటికప్పుడు కేంద్రం నిధులిస్తోందని.. కేసీఆర్ ది ఒక తొండి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం.కాళేశ్వరం ప్రాజెక్టు లోని […]

Written By: NARESH, Updated On : August 27, 2022 6:44 pm
Follow us on

Kishan Reddy: మాట్లాడితే కేంద్రం తెలంగాణకు నిధుల ఇవ్వడం లేదని చెప్పే సీఎం కేసీఆర్ కు సూటిగా పలు ప్రశ్నలు సంధించాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పి మరీ కడిగేశారు. బండి సంజయ్ 3వ విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా జేపీ నడ్డాతోపాటు కిషన్ రెడ్డి కూడా పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ కు ఎప్పటికప్పుడు కేంద్రం నిధులిస్తోందని.. కేసీఆర్ ది ఒక తొండి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం.కాళేశ్వరం ప్రాజెక్టు లోని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో రహదారుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టామని.. వరంగల్ నుంచి జగిత్యాల వరకు 4 వరుసల రహదారుల నిర్మాణం కోసం రూ.4 వేల కోట్ల పై చిలుకు ఖర్చు చేస్తున్నామని.. వరంగల్ నుంచి ఖమ్మం వరకు 4 వరుసలు రహదారుల నిర్మాణం కోసం రూ.3360 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రూ.20,000 కోట్ల పై చిలుకు కేవలం రోడ్ల నిర్మాణం కోసమే బీజేపీ ఖర్చు చేస్తోందని.. రామప్ప దేవాలయం కు యునెస్కో గుర్తింపు తెచ్చిన ఘనత మోడీదేనన్నారు. వేయి స్తంభాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని.. వేయి స్తంభాల గుడిలో మంటపం కూలిపోతే… ఇప్పటివరకు కేసీఆర్ పట్టించుకోలేదు.. డిసెంబర్ లోపు వేయి స్తంభాల గుడిలో మంటపం నిర్మిస్తామని తెలిపారు.

వరంగల్ పోర్టుకు రూ.5 కోట్లు కేటాయించామని.. కాజీపేట లో రైల్వే ఒరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకూ… భూమి కేటాయించలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో డిఫెన్స్ కు సంబంధించిన సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నామని.. రూ.800 కోట్లతో వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం.. హెరిటేజ్, స్మార్ట్, అమృత్ సిటీ లను ఈ ప్రాంతానికి ఇచ్చాం రూ.200 కోట్లతో ‘MSME Technical Center’ ఏర్పాటు చేస్తాం అంటే.. గత 3 సంవత్సరాలుగా భూమి కూడా ఇవ్వలేదన్నారు. వరంగల్ జిల్లా కు కేసీఆర్ ఎంత ఖర్చు పెట్టాడో… సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ కు కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు మేము సిద్ధమని సవాల్ చేశారు.

ఉద్యమాల పురిటి గడ్డ ఓరుగల్లు గడ్డ.. చైతన్యానికి ప్రతీక ఓరుగల్లు కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం కేసీఆర్ తో పాటు కేసీఆర్ కుటుంబం మోచేతి నీళ్లు తాగే టీఆర్ఎస్ నేతలారా.. మీది మాటల ప్రభుత్వం మాత్రమేనని కిషన్ రెడ్డి నిపులు చెరిగారు. కేసీఆర్…. నీకు కళ్ళుంటే చూడు, చెవులు ఉంటే విను, కాళ్ళు ఉంటే తిరుగు అని.. కేసీఆర్…. నీకు కళ్ళుంటే చూడు, లేకుంటే… నా దగ్గరికి రా అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోస్తే… బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే… గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఎత్తేస్తామని.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి, ఆ కుటుంబాన్ని ఫార్మ్ హౌజ్ కే పరిమితం చేస్తామన్నారు.

చివరగా కిషన్ రెడ్డి నోట జై శ్రీరామ్ నినాదం వినిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.. జై శ్రీరామ్ అంటూ…కిషన్ రెడ్డి ప్రసంగం ముగించడం విశేషం. ఇప్పటివరకూ హిందుత్వ నినాదాలు చేయని కిషన్ రెడ్డి తొలిసారి వరంగల్ సభలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషంగా మారింది.