సోము వీర్రాజు అంటే కొడాలి నాని ఎందుకు స్పందించారు?

వైసీపీ ప్రభుత్వం అరచేతిలో ‘ఇళ్లు’ చూపిస్తోందని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. 26 నెలల్లో ఒక్క కొత్త ఇల్లు కట్టని వైసీపీ ప్రభుత్వం 2022కు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తాం అని ఎలా చెపుతుందని ప్రశ్నించారు. రాష్ట్రం లో నిర్మాణం పూర్తి అయిన ఇళ్ళు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పగలారా!? అంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కు బిల్లులు ఇవ్వలేకనే పేదల ఇళ్ళ బదలాయించడం లేదని విమర్శించారు. […]

Written By: NARESH, Updated On : July 20, 2021 3:54 pm
Follow us on

వైసీపీ ప్రభుత్వం అరచేతిలో ‘ఇళ్లు’ చూపిస్తోందని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. 26 నెలల్లో ఒక్క కొత్త ఇల్లు కట్టని వైసీపీ ప్రభుత్వం 2022కు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తాం అని ఎలా చెపుతుందని ప్రశ్నించారు. రాష్ట్రం లో నిర్మాణం పూర్తి అయిన ఇళ్ళు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పగలారా!? అంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కు బిల్లులు ఇవ్వలేకనే పేదల ఇళ్ళ బదలాయించడం లేదని విమర్శించారు.

అర్బన్ హౌసింగ్ పై అవినీతిలో ఈ ప్రభుత్వం విచారణ ఎందుకు జరపలేదని విష్ణు ప్రశ్నించారు. అన్నింటిలో విచారణ అంటున్న వైసీపీ హౌసింగ్ పై ఎందుకు వెనక్కి తగ్గుతుందని నిలదీశారు. నాటి మంత్రి నారాయణతో నేటి వైసీపీ ప్రభుత్వం అంతా సెట్ చేసుకుందా? అని ప్రశ్నించారు.మంత్రి కొడాలి నాని ధాన్యానికి సంబంధించి కేంద్రం నిధులివ్వలేదు అంటున్నారని.. మరి ఇళ్లకు ఇచ్చిన డబ్బులు ఏం చేశారని విమర్శించారు.

మంత్రులే మిల్లర్లు నడుపుతున్నారు కాబట్టి ధాన్యం డబ్బులు వేయడం లేదని అనిపిస్తుందని విష్ణు విమర్శించారు. తెలంగాణా మంత్రి నిరంజన్ ఏపీ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గతంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి అన్నారని.. ఇప్పుడు జోక్యం చేసుకొంటే మా ‌హక్కులను హరిస్తున్నారు అంటున్నారని విమర్శించారు.

తెలంగాణా మంత్రి ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమూ వీర్రాజు పై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఏపి నీళ్లను దొంగల్లా వాడుకుంటూ జల దోపిడీకి పాల్పడుతున్నది తెలంగాణ వాళ్లేనన్నారు. తెలంగాణా ద్రోహం చేస్తుంటే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోకూడదని ప్రశ్నించారు. తెలంగాణా ముఖ్యమంత్రి, మంత్రులు నీటి దొంగ లని.. ఏపి లో ఉన్న తెలంగాణా ఏజెంట్లు కేసీఆర్ కు తొత్తొలుగా మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణ మంత్రులు ఏపీలో ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణాలో వ్యాపారాలు చేస్తూ ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని విష్ణు ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమ వాసి అయి ఉండి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. సిపిఎం, సీపీఐ పార్టీలకు సిగ్గులేదా? మోడీ జోక్యం చేసుకోవాలన్న నేతలు ఇప్పుడు జోక్యం చేసుకుంటే తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని విష్ణు విమర్శించారు. నీతి అజెండా లేకుండా సిపిఎం, సిపిఐ తెలంగాణాకు వ్యతిరేకమా ఎపి కి అనుకూలమా అని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఐ, సిపిఎంలు టిఆర్ఎస్ పార్టీ తొత్తులు అని విమర్శించారు.

జల వివాదంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెల‌ంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దాగుడు మూతలు ఇక ఆపాలన్నారు. రైతుల జీవితాలతో ఆడే ఈ కుట్రతో అటు తెలంగాణలో కేసిఆర్ ఇటు ఏపీలో జగన్ ద్రోహులుగా మారారన్నారు

ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రే కాదు మంత్రులంతా గిఫ్టులు తీసుకుంటున్నారని.. సోమవీర్రాజు మంత్రి ఇళ్లు కట్టుకున్నారని పేరు చెప్పకపోయినా కొడాలి నాని ఎందుకు స్పందించారని విమర్శించారు. నాని స్పందించడం వెనుక అనుమానం వస్తుందని అన్నారు. కొనాలి నానికి చిత్తశుద్ధి ఉంటే మంత్రే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.