ఏపీలో ఆరు నెలల పాటు ఎన్నికలు వద్దు

క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, కేసులు అధికంగా న‌మోద‌వుతున్న జిల్లాల్లో వెంట‌నే హెల్త్ ఎమ‌ర్జ‌న్సీ ప్ర‌క‌టించాల‌ని, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భాజ‌పా రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంద‌ని ఆరోపించారు. ఏపిలో నాలుగు జిల్లాల్లో 70శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంద‌న్నారు. ఆయా జిల్లాల్లో వెంట‌నే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రత్యేక […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 1:27 pm
Follow us on


క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, కేసులు అధికంగా న‌మోద‌వుతున్న జిల్లాల్లో వెంట‌నే హెల్త్ ఎమ‌ర్జ‌న్సీ ప్ర‌క‌టించాల‌ని, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భాజ‌పా రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంద‌ని ఆరోపించారు. ఏపిలో నాలుగు జిల్లాల్లో 70శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంద‌న్నారు. ఆయా జిల్లాల్లో వెంట‌నే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఓవైపు సామాజిక దూరం పాటించ‌కున్నా కూడా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేద‌న్నారు. వైసిపి ఎమ్మెల్యే లు, మంత్రులు లాక్‌డౌన్ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడంలేద‌ని విమ‌ర్శించారు. హెల్త్ బులెటిన్‌లో కూడా అనేక లోపాలుంటున్నాసరిదిద్దుకోవడం లేద‌ని వ్యాఖ్యానించారు. కర్నూలులో ఒక‌ వైద్యుడు చనిపోతే తొలుత నెగిటివ్ అన్నార‌ని తర్వాత పాజిటివ్‌గా నిర్ధారించినా అప్పటికే పరిస్థితి మారిపోయింద‌ని తెలిపారు. ప‌విత్రమైన రంజాన్ మాసంలో దాతలు భోజనం పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చార‌ని ఇది సరైంది కాద‌ని దీనిపై పునరాలోచన చేయాల‌న్నారు. లౌడ్ స్పీకర్‌కు అనుమతి ఇవ్వడం ద్వారా అన్ని ప్రాంతాలలో కరోనా జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేయాల‌ని సూచించారు. ఏపి జాలర్లను కాపాడేందుకు గుజరాత్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోష‌దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు. వైసిపి నేతలు సేవ పేరుతో వందల మందితో ర్యాలీ చేయడం, జన సమూహంతో తిరగడం సరికాద‌న్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులను ఆయా జిల్లాలకు పంపించి పరిస్థితి పర్యవేక్షణ చేసేలా చూడాల‌న్నారు. రైతుకు ఎకరాకు రూ.25వేలు సాయం‌ అందించాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇతర రాష్ట్రాలలో పంటలు విక్రయించే బాధ్యత తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కారంలో సిఎం ప్రత్యేకంగా సమీక్ష చేయాల‌ని కోరారు. కరోనా సమయంలో కూడా సిఎం జగన్ ఎన్నికల గురించి ఆలోచన చేయడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల పాటు ఎన్నికలు ఉండవని ప్రకటన చేయాల‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువని పేర్కొన్నారు. కోవిడ్-19 విషయంలో కేంద్రం సూచనలు రాష్ట్రం ఆచరించాల‌ని కోరారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ల్యాబ్‌ల సంఖ్య పెంచాల‌ని, రాష్ట్రం లో కొన్ని ప్రవేట్ ఆసుపత్రుల్లో అయినా అత్యవసర కేసులు చూసేలా ప్ర‌భుత్వం ఆదేశాలివ్వాల‌ని తెలిపారు.

ఎన్నికల కమిషనర్ వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంద‌ని, ఈ సమయంలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంద‌న్నారు. వైసిపి ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకులు ఇస్తుంద‌న్నారు. ఏపిలో అధికార పార్టీలకు ఒక చట్టం.. విపక్షాలకు మరో చట్టం అన్నట్లుగా ఉంద‌న్నారు. నెహ్రూ యువజన కేంద్రం జాతీయ వైస్ ఛైర్మన్‌గా తాను ఉన్నాన‌ని అందువ‌ల్లే ఎమర్జెన్సీ కోటా కింద తాను అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్న‌ట్లు చెప్పారు. ఏపిలో తాను అతిధిగా ఉన్నాన‌న్నారు. సామాజిక దూరం పాటించి పనులు చేస్తున్న‌ట్లు తెలిపారు. కరోనా విధుల్లో పాల్గొంటున్న జర్నలిస్టులకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల‌న్నారు. వైసిపి నేతల నిర్లక్ష్యం వల్లే చాలా ప్రాంతాలలో కరోనా కేసులు పెరగటం వాస్తవం అన్నారు. కారకులైన‌ వారందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా పాజిటీవ్ కేసులు ప్రభుత్వం ఉద్యోగులు, పోలీసులు, వాలంటీర్‌లకు‌ వచ్చింద‌ని మీడియా వాస్తవాలు చెబితే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నార‌న్నారు. కరోనా వ్యాప్తి చెంద‌కుండా ఇప్పటికైనా ప్ర‌భుత్వం ప‌టిష్ఠమైన చర్యలు చేపట్టాల‌న్నారు.