Homeజాతీయ వార్తలుBihar Assembly Elections : రేవంత్ బీహార్ వెళ్లి కాంగ్రెస్ ను ముంచాడా?

Bihar Assembly Elections : రేవంత్ బీహార్ వెళ్లి కాంగ్రెస్ ను ముంచాడా?

Bihar Assembly Elections: బీహార్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి బీహార్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వ ఆగడాలను ఎండ కడుతున్నారు. ఇటీవల రాహుల్ నిర్వహించిన ప్రచారంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. ఈ ప్రచారంలో రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.

రేవంత్ బీహార్ లో ప్రచారం చేయడాన్ని అక్కడి కాంగ్రెస్ నాయకులు తప్పు పడుతున్నారని భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం విమర్శిస్తోంది. అంతే కాదు అక్కడి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది.. ఇటీవల జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ రేవంత్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీహార్ ప్రజలను తీవ్రస్థాయిల విమర్శించిన రేవంత్ ఇక్కడ ఎన్నికల ప్రచారం ఎలా చేస్తారని మండిపడ్డారు. గ్రామాల్లోకి వెళ్తే చీపురులతో రేవంత్ వెంట పడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని మర్చిపోకముందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ ప్రచారం చేయడాన్ని తప్పు పడుతున్నట్టు గులాబీ సోషల్ మీడియా అంటున్నది. తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో బీహార్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను ప్లే చేస్తోంది.

Also Read: తెలుగు జడ్జి వర్సెస్‌ తమిళ గవర్నర్.. ఆసక్తికరంగా ఉపరాష్ట్రపతి సమరం

బీహార్ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే విషయాలను పక్కన పెడితే తెలంగాణలో మాత్రం గులాబీ పార్టీ, గులాబీ పార్టీ సోషల్ మీడియా మాత్రం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండడం విశేషం. అయితే ఈ విమర్శలకు కాంగ్రెస్ నేతల వద్ద సమాధానం లేదు. ఎందుకంటే గతంలో బీహార్ ప్రజలను ఉద్దేశించి రేవంత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాష్ట్రానికి, కెసిఆర్ కుటుంబానికి ముడిపెట్టి ఆయన విమర్శలు చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోను రేవంత్ అదే తీరుగా మాట్లాడారు. అందువల్లే ఇప్పుడు ఆ వ్యాఖ్యలను అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రస్తావిస్తున్నారు. తమను విమర్శించిన రేవంత్.. తమ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రావడం వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. మరి దీనిపై రాహుల్ ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version