Homeజాతీయ వార్తలుBandi Sanjay : భైంసాకు వెళ్లాలంటే వీసా కావాలా? బండి సంజయ్ సంచలన కామెంట్స్

Bandi Sanjay : భైంసాకు వెళ్లాలంటే వీసా కావాలా? బండి సంజయ్ సంచలన కామెంట్స్

Bandi Sanjay : ‘బైంసాకు అసలు ఎందుకు వెళ్లకూడదు? బైంసాకు వెళ్లాలేం వీసా తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలా? బైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా?’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బైంసాలో అల్లర్లు సృష్టించింది ఎవరు? అని ప్రశ్నించారు. బైంసా అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నదెవరు? బైంసాలో అమయాకుల ఉసురు తీసిందెవరు? కేసులు పెట్టి, పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరు? అంటూ నిలదీశారు. మేం బైంసాలో పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే బైంసాకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు.

పాతబస్తీలో పాదయాత్రను ప్రారంభించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద నుండి పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగాయా? ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ముకాస్తోంది. మజ్లిస్ నేతలు చెప్పినట్లు నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఫ్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు. పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకుంటాం. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాం. వారికి భరోసా కల్పిస్తామన్నారు.

నిన్న పోలీసులు అడ్డుకున్న తాటిపల్లి ( జగిత్యాల సమీపంలో) లో బండి సంజయ్ కు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు. తాటిపల్లి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ నిర్మల్ ఆడెల్లి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్దకు బయలు దేరిన బండి సంజయ్. ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకున్నాం. పూజలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. నిన్న పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొదటి సభ నిర్వహించుకోవాలని అనుమతిచ్చి… ఆ తరువాత కుంటి సాకులతో అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు.

ఇప్పటి వరకు 4 విడతలుగా ప్రజాసంగ్రామ యాత్ర జరిగింది. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా పాదయాత్రను కొనసాగించాం. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డకునేందుకు యత్నించిందని బండి సంజయ్ మండిపడ్డారు. అందుకే హైకోర్టుకు వెళ్లాం… హైకోర్టు ఉత్తర్వులపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తాం.అందులో భాగంగా ఈరోజే నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళుతున్నా. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తాం. అక్కడినుండే లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తాం… బైంసాను బండి సంజయ్ ను దూరం చేశారేమో…. కానీ బైంసా ప్రజల నుండి బండి సంజయ్ ను దూరం చేయలేరని బండి అన్నారు.ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుండి బైంసా ప్రజలను వేరు చేయలేరన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version