spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Attack On Kurnool Janasena Party Office: క‌ర్నూలు జ‌న‌సేన ఆఫీసుకు తాళం.. అన్నంత ప‌ని...

Attack On Kurnool Janasena Party Office: క‌ర్నూలు జ‌న‌సేన ఆఫీసుకు తాళం.. అన్నంత ప‌ని చేసిన వైసీపీ నేత‌లు

Attack On Kurnool Janasena Party Office: ఏపీలో రోజు రోజుకూ ప్ర‌తీకార రాజ‌కీయాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జ‌న‌సేన అధిఏత ప‌వ‌న్ విష‌యంలో వైసీపీ ఎలాంటి ప్ర‌తికారానికి పాల్ప‌డుతుందో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న సినిమాల రిలీజ్ విష‌యంలో రేట్లు తగ్గించి ఎంత టార్గెట్ చేసిందో చూశాం. ఇక ఆయ‌న మూవీ భీమ్లానాయ‌క్ అయిపోయాకే కొత్త జీవోను తెచ్చారు. ఇదిలా ఉండ‌గా.. మొన్న ఆవిర్భావ స‌భ విష‌యంలో కూడా ఇలాగే జ‌రిగింది.

Attack On Kurnool Janasena Party Office
Jana Sena

జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు ఎవ‌రూ స్థ‌లాలు ఇవ్వ‌కుండా ఇబ్బందులు పెట్టింది వైసీపీ ప్ర‌భుత్వం. కానీ ఎట్ట‌కేల‌కు ఆ స‌భ‌ను నిర్వ‌హించారు. అయితే ఆ స‌భ త‌ర్వాత ప‌వ‌న్ ఇమేజ్ భారీగా ప్ర‌జ‌ల్లో పెరిగిపోతోంది. దీన్ని త‌గ్గించేందుకు వైసీపీ ప్ర‌భుత్వం మ‌రోసారి ప్ర‌తీకార చర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ఇందులో భాగంగా క‌ర్నూలులోని జ‌న‌సేన ఆఫీసుపై ప‌డ్డారు వైసీపీ నేత‌లు.

Also Read:  జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు

జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌లో ఎప్ప‌టి నుంచో ఒకే చోట ఆఫీసు కార్యాల‌యం ఉంది. దీన్ని స్వ‌యంగా ప‌వ‌న్ ప్రారంభించారు. కాగా దీన్ని మూయించేందుకు కొంద‌రు గుర్తు తెల‌యని దుండ‌గులు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా జ‌న‌సేన నేత‌ల‌ను నిత్యం భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. అయితే జ‌న‌సేన నేత‌లు మాత్రం ఆఫీసును మూసేయ‌క‌పోవ‌డంతో.. ఈ రోజు మ‌రింత బ‌రి తెగించారు వైసీపీ నేత‌లు.

Attack On Kurnool Janasena Party Office
YCP

ఏకంగా ఆఫీసు మీద దాడి చేసి లోప‌ల ఉన్న వారిని బ‌య‌ట‌కు పంపించి, ఫర్నీచ‌ర్‌ను కూడా బ‌య‌ట పారేశారంట‌. అనంత‌రం ఆఫీసుకు తాళం వేశారు. అయితే ఇదంతా వైసీపీ నేత‌లు కావాల‌ని చేయించార‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. పైగా బిల్డింగ్ య‌జ‌మాని కూడా వారితో చేరిపోయి ఖాళీ చేయించాలంటున్నారు. అయితే తాము ఐదేండ్ల వ‌ర‌కు అగ్రిమెంట్ రాసుకున్నామ‌ని, కానీ వైసీపీ నేత‌ల ఒత్తిడితో య‌జ‌మాని ఖాళీ చేయాలంటున్నాడంట‌. ఇక్క‌డే కాదు చాలా ప్రాంతాల్లో అద్దె బిల్డింగుల్లో ఉన్న జ‌న‌సేన ఆఫీసుల‌ను ఖాళీ చేయించాల‌ని వైసీపీ నేత‌లు చూస్తున్నారు. కానీ జనసేన నేతలు మాత్రం తాము అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌బోమంటూ తేల్చి చెప్పేస్తున్నారు.

Also Read: బీజేపీతో యుద్ధానికి సిద్ధమవుతున్న కేసీఆర్ ?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper
Exit mobile version