Homeజాతీయ వార్తలుAssam: మరో ఉగ్ర కుట్ర భగ్నం.. అస్సోంలో కీలక ఆపరేషన్‌!

Assam: మరో ఉగ్ర కుట్ర భగ్నం.. అస్సోంలో కీలక ఆపరేషన్‌!

Assam: దేశవ్యాప్తంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలు వేగవంతమవుతున్నాయి. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో 2,900 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ దాచిన ’డాక్టర్లు’ రూపంలో వైట్‌ కాలర్‌ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. యూనివర్సిటీల్లో బోధన చేస్తూ కుట్ర పనిలో ఉండటం భద్రతా బలగాలను మేల్కొలిపింది. ఇది దేశవ్యాప్త ఆపరేషన్‌లకు దారితీసింది.

ఇమామ్‌ మహ్మదుల్‌ ఖాఫిలా..
పలకడం ఇబ్బందిగా ఉన్నా.. పేరు అదే. ఇతను అస్సాం, త్రిపురా, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో ఇమామ్‌ మహ్మదుల్‌ ఖాఫిలా (మహ్మద్‌ సైన్యం) కార్యకలాపాలు వ్యాపించాయి. 2018లో జమాత్‌–ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ (జేఎంబీ) అనుబంధంగా ప్రారంభమైంది. 2024 ఆగస్టు తర్వాత బంగ్లాదేశ్‌ అరాజకత్వంతో అల్‌–ఖాయిదా, అన్సార్‌–ఉల్‌ బంగ్లా ఈ సంస్థను యాక్టివేట్‌ చేశాయి. ఊర్బ్‌ ఆకాశ్‌ సోషల్‌ మీడియా గ్రూప్‌ ద్వారా ప్రచారం చేశాయి.

ముస్లింలు ఎక్కుగా ఉన్న జిల్లాలు..
అస్సాం బక్సా (చిరాంగ్‌), ధరంగ్, బర్పెటా జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచాయి. త్రిపుర, బంగ్లాదేశ్‌ సరిహద్దుల సమీపంలో అల్లర్లు కుట్ర. ఉమర్, ఖాలిద్, తమీర్‌ వంటి ముగ్గురు కార్యకర్తలను రిక్రూట్‌ చేస్తూ ఉగ్రవాదులను సిద్ధం చేస్తున్నారు.

డిసెంబర్‌ 29న కీలక ఆపరేషన్‌..
డిసెంబర్‌ 29 రాత్రి గూఢచారి విభాగం, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ దేశవ్యాప్త రైడ్లు చేశాయి. త్రిపురాలో ఒకరు, అస్సాంలో 10 మంది అరెస్టయ్యారు: నసీబుద్దీన్, జనాబ్‌ అలీ, మిజాముర్‌ రహమాన్, సుల్తాన్‌ మహ్మద్, సిద్దీఖ్‌ అలీ, దిల్బర్‌ రజాక్‌ మొదలైనవారు. ఉగ్ర సంస్థ బలోపేతం కాకుమందే నలిపేశారు. పాకిస్తాన్‌ ప్లాన్‌ విచ్ఛిన్నమైంది.

ఈ ఆపరేషన్‌లు అల్లర్లు, పేలుళ్లను నిరోధించాయి. ఢిల్లీ చుట్టూ ఊఈఓ మీటింగ్‌లు జరుగుతున్నాయి. కొత్త సంవత్సరానికి ముందు భద్రతా చర్యలు వేగవంతమవుతున్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు కొనసాగుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular