spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Three Capitals: మూడు రాజధానులు.. ఆ తర్వాత ఎన్నికలు?

AP Three Capitals: మూడు రాజధానులు.. ఆ తర్వాత ఎన్నికలు?

AP Three Capitals: అమరావతి టూ అరసవల్లి మహా పాదయాత్ర 2.0 చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చనీయాంశమైంది. మరోవైపు మూడు రాజధానులు ఏర్పాటుచేసి తీరుతామని వైసీపీ మంత్రులు, కీలక నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం అమరావతి వ్యతిరేక,అనుకూల పోస్టులు, కామెంట్లు హోరెత్తుతున్నాయి. ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు అమరావతి రైతులు చేపడుతున్న పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం తాము ఏకైక రాజధానికి మాత్రమే నిధులు కేటాయిస్తామని స్పష్టం చేస్తోంది. దీంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. సరిగ్గా పాదయాత్ర సమయంలో ప్రకటన చేయడంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అమరావతి టూ తిరుపతి పాదయాత్ర చేసినప్పుడు ప్రభుత్వం నానా రభస చేసింది. కనీసం యాత్ర చేపట్టే వారికి బస లేకుండా చేసింది. లాఠీచార్జీకి కూడా దిగింది. ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. కానీ బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకైక రాజధానికే నిధులు అన్న ప్రకటన చేసిన విషయాన్ని అందరూ గుర్తుచేస్తున్నారు. తద్వారా పాదయాత్రకు బీజేపీ మద్దతు ఉందన్న సంకేతాలు పంపింది. మరోవైపు పాదయాత్ర సజావుగా జరిపించే బాధ్యతను న్యాయస్థానం పోలీస్ శాఖకు అప్పగించింది. స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

AP Three Capitals
JAGAN

సర్కారు ఉక్కిరిబిక్కిరి..
అయితే ఈ మొత్తం వ్యవహారంలో జగన్ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. అమరావతి రాజధానికి మద్దతు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతోంది. దీనికి విరుగుడుగా ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఆ పార్టీ వారికే తెలియదు. అమాత్యులు, అధికారులతో కనీస ఆలోచన చేయరు. సంప్రదించరు కూడా. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వైసీపీ శ్రేణులు మాత్రం ఆహా ఓహో అంటాయి. కొందరైతే డైనమిక్ సీఎం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. అందుకే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయమే ఒక డైనమిక్. మూడు రాజధానులతో ఏపీ అమెరికా అవుతుందని జగన్ భావిస్తున్నారుట. అందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.కానీ పార్టీ శ్రేణులు మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు.. మూడు రాజధానులను రిఫరెండంగా తీసుకొని వెళితే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

AP Three Capitals
JAGAN

విపక్షం నుంచి సవాల్...
ఏపీ సీఎం జగన్ కు ఒక అలవాటు ఉంది. సొంత పార్టీ నేతలు చెబితే వినరు. పార్టీలో సీనియర్లను గౌరవించరు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అవునంటే కాదంటారు.. కాదంటే అవునంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి సరికొత్త సవాల్ వచ్చి పడుతోంది. దమ్ముంటే మూడు రాజధానులపై ఎన్నికలకు వెళదామని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అసెంబ్లీని డిజాల్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జగన్ పునరాలోచనలో పడారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నారు. విపక్షం సవాల్ ను తేలిక తీసుకుంటున్నారు. ముందుగా మూడు ప్రాంతాలపై చిచ్చు రేపాలని నిర్ణయించుకున్నారు. అందుకే తమ వైసీపీ సోషల్ మీడియా విభాగానికి పనిచెప్పారు. మంత్రులు రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త విభిన్నంగా ఉంటుంది కాబట్టి… తనకు తిరుగులేని ప్రజాదరణ ఉందని భావిస్తున్నారు కాబట్టి.. తనకిష్టమైన మూడు రాజధానులపై రిఫరెండంగా తీసుకొని ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper