దేశంలో కోవిడ్ 19 టీకా పంపిణీలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. మంగళవారం రాష్ట్రం లో 1 కోటి టీకాలు వేసి ఆ మార్కును దాటి కొత్త రికార్డులు నమోదు చేసింది. కోటి టీకాల మార్కును దాటింది. ఇది దేశంలోని ఏ రాష్ట్రాలలోనూ అత్యధికం కావడం విశేషం..
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మంగళవారం నాటికి 1,00,17,712 మందికి రెండు మోతాదుల వ్యాక్సిన్ వేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి రెండు మోతాదుల వ్యాక్సిన్ ఇవ్వడంపై ఏపీ మొదట దృష్టి సారించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మొదట్లో నిర్ణయించినప్పటికీ, టీకా కొరత కారణంగా రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని నిలిపేసింది.
అంతకుముందు, రోజులో లక్ష వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ కోవిడ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా జగన్ సర్కార్ కొత్త రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కోవిడ్ టీకాల తయారీదారుల నుండి పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ను కొనుగోలు చేసింది.
ఏదేమైనా కొత్త టీకాలను పూర్తిగా నిలిపివేసి.. మొదటి మోతాదు తీసుకున్న వారికి రెండవ డోసు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు సెకండ్ డోస్ కార్యక్రమం గొప్పగా సాగుతోంది.
ప్రతిరోజూ పాజిటివ్ కేసులు ఏపీలో బాగానే వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఈ కేసులను.. మరణాలను తగ్గించడంలో సహాయపడ్డాయి.
టోల్ ఫ్రీ నంబర్ 104లో ఇప్పటికే 17,000 మంది వైద్యులు ప్రజలకు టెలీ కౌన్సెలింగ్ అందిస్తున్నారు, ముఖ్యంగా హోం క్వారంటైన్ లో ఉన్నవారికి వైరస్ గురించి అవగాహన కల్పించడంలో సహాయపడ్డారు.ఈ కార్యక్రమాలన్నీ మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండటానికి సహాయపడ్డాయి.