‘రుద్రమదేవి‘ సీక్వెల్ వచ్చేస్తోంది!

కమర్షియల్ సినిమాలకు తనదైన కళాత్మకతను జోడించి అద్భుతమైన కళాఖండాలు ఆవిష్కరించగల దర్శకుడు గుణశేఖర్. ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాలే ఈ విషయాన్ని చెబుతాయి. అయితే.. కొంత కాలంగా ఆయన కమర్షిల్ సినిమాలను సైడ్ ట్రాక్ లో పెట్టేసి, పౌరాణికాలను మెయిన్ ట్రాక్ ఎక్కిస్తున్నారు. రుద్రమదేవి వంటి చారిత్రక చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించి అబ్బుపరిచిన గుణశేఖర్.. ఆ మధ్య రానా ‘హిరణ్యకశ్యప’ అనే పౌరాణిక చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే.. కారణమేంటో తెలియదుకానీ.. ‘హిరణ్యకశ్యప’ను పక్కనపెట్టి […]

Written By: Bhaskar, Updated On : June 2, 2021 12:46 pm
Follow us on

కమర్షియల్ సినిమాలకు తనదైన కళాత్మకతను జోడించి అద్భుతమైన కళాఖండాలు ఆవిష్కరించగల దర్శకుడు గుణశేఖర్. ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాలే ఈ విషయాన్ని చెబుతాయి. అయితే.. కొంత కాలంగా ఆయన కమర్షిల్ సినిమాలను సైడ్ ట్రాక్ లో పెట్టేసి, పౌరాణికాలను మెయిన్ ట్రాక్ ఎక్కిస్తున్నారు.

రుద్రమదేవి వంటి చారిత్రక చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించి అబ్బుపరిచిన గుణశేఖర్.. ఆ మధ్య రానా ‘హిరణ్యకశ్యప’ అనే పౌరాణిక చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే.. కారణమేంటో తెలియదుకానీ.. ‘హిరణ్యకశ్యప’ను పక్కనపెట్టి శకుంతలను ముందుకు తెచ్చారు. భారతాన ఆది పర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం శకుంతల-దుష్యంతుని లవ్ స్టోరీని చెక్కుతున్నారు. ‘శాకుంతలం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్ లో నటిస్తుండగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా కనిపించనున్నారు.

అయితే.. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమంటే ఈ చిత్రం తర్వాత మళ్లీ పౌరాణిక చిత్రాన్నే సెల్యులాయిడ్ పై చిత్రించాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అది కూడా తాను తీసిన రుద్రమదేవి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించబోతున్నారని టాక్. ‘ప్రతాపరుద్ర’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్టుపై ఓ క్లారిటీ కూడా వచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం లైన్ మీదున్న ‘శాకుంతలం’ మూవీ తర్వాత ‘హిరణ్యకశ్యప’ను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల తర్వాత ‘ప్రతాపరుద్ర’ను మొదలు పెడతారని ఫిల్మ్ నగర్ కబర్. మొత్తానికి కమర్షియల్ చిత్రాలను పూర్తిగా పక్కనపెట్టిన గుణశేఖర్.. తనలోని కళాపిపాసిని ఈ విధంగా సంతృప్తి పరుస్తున్నారని అర్థమవుతోంది.