కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రెడ్ జోన్ గా ప్రకటించిన చిలకలపూడి, సర్కారు తోట, సీతయ్య నగర్, నవీన్ మిట్టల్ కాలనీల లోని పలు ప్రాంతలలో రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సోమవారం పర్యటించారు. ఆయన ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం విశేషం.
ఉదయం ఏడు గంటల నుంచి పర్యటిస్తూ ప్రజలు భయాందోళన చెందవద్దని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. నిత్యావసరాలైన పాలు, కూరగాయలు ప్రజలకు ప్రతి ఇంటికి వస్తున్నాయా అని ప్రజల వద్ద నుండి సమాచారం తెలుసుకున్నారు. నిత్యావసర సరుకులు, మందులు కావాల్సిన వారు పాంప్లేట్ లో ఉన్న నంబర్లకు ఫోన్ చేస్తే ఇంటివద్దకు తెచ్చి అందజేస్తారని అక్కడి ప్రజలకు మంత్రి తెలిపారు.