తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోన సీమ, రాయలసీమల్లో కురిసిన వర్షాలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. తెలంగాణలో గత నెలలో కురిసిన వర్షాలతో గొలుసుకట్టు చెరువులు మంత్తడి దూకుతున్నాయి. రాష్ట్రంలోని గోదావరి నది అవసరానికి మించి ప్రవహిస్తోంది. Also Read: కేసీఆర్.. జగన్ ల జల జగడం ఎటు దారితీస్తుంది? తాజాగా.. వాతావరణ శాఖ అధికారులు మరో రిపోర్టును ప్రకటించారు. తెలంగాణకు మరో […]

Written By: NARESH, Updated On : October 7, 2020 3:50 pm
Follow us on

తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోన సీమ, రాయలసీమల్లో కురిసిన వర్షాలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. తెలంగాణలో గత నెలలో కురిసిన వర్షాలతో గొలుసుకట్టు చెరువులు మంత్తడి దూకుతున్నాయి. రాష్ట్రంలోని గోదావరి నది అవసరానికి మించి ప్రవహిస్తోంది.

Also Read: కేసీఆర్.. జగన్ ల జల జగడం ఎటు దారితీస్తుంది?

తాజాగా.. వాతావరణ శాఖ అధికారులు మరో రిపోర్టును ప్రకటించారు. తెలంగాణకు మరో వానగండం పొంచి ఉందని పేర్కొన్నారు. వాయువ్య బంగా‌ళా‌ఖాతంతోపాటు ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీ‌డనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అను‌బం‌ధంగా 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌న ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది. ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా 1.6 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వద్ద ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ఏర్పడిందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలిపారు. ఈ ప్రభా‌వంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడ‌క్కడ ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన ఓ మోస్తరు నుంచి తేలి‌క‌పాటి వర్షాలు కురు‌స్తా‌యని వెల్లడించారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

తాజాగా…ఉత్తర అండమాన్‌ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ త్వరాత 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా ప్రయాణించి మధ్య బంగాళఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Also Read: కేంద్రంతో కయ్యం.. ఎవరికి నష్టం.?

దక్షిణ కోస్తా ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో మంగళవారం మంచిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.  రానున్న నాలుగు రోజుల్లో విశాఖ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు కూడా చెప్పారు.