వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే దీనిపై సీబీఐ ఎంక్వైరీ నడుస్తుండగా దర్యాప్తునకు కరోనా అడ్డంకిగా మారింది. వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న టీంలోని ఏడుగురికి కరోనా సోకడంతో ప్రస్తుతానికి దర్యాప్తు వాయిదా పడింది. వారు మళ్లీ కోలుకునే వరకూ దర్యాప్తు ఉండదని అనుకున్నారు. కానీ.. సీబీఐ మాత్రం ఆ కేసును తేల్చాలని నిర్ణయించుకుంది. దర్యాప్తు ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచి ప్రారంభించేందుకు కొత్త బృందాన్ని రంగంలోకి దించాలనుకుంది. Also Read: […]

Written By: NARESH, Updated On : October 15, 2020 7:24 pm
Follow us on

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే దీనిపై సీబీఐ ఎంక్వైరీ నడుస్తుండగా దర్యాప్తునకు కరోనా అడ్డంకిగా మారింది. వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న టీంలోని ఏడుగురికి కరోనా సోకడంతో ప్రస్తుతానికి దర్యాప్తు వాయిదా పడింది. వారు మళ్లీ కోలుకునే వరకూ దర్యాప్తు ఉండదని అనుకున్నారు. కానీ.. సీబీఐ మాత్రం ఆ కేసును తేల్చాలని నిర్ణయించుకుంది. దర్యాప్తు ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచి ప్రారంభించేందుకు కొత్త బృందాన్ని రంగంలోకి దించాలనుకుంది.

Also Read: జగన్‌పై ఏకమైన సీనియర్ లాయర్లు, రిటైర్డ్‌ జడ్జిలు? ఏం జరుగనుంది?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైఎస్‌ వివేకా హత్యకు గురయ్యారు. ఆ సమయంలో జగన్‌ ప్రతిపక్ష నేతగానే ఉన్నారు. అయితే.. చంద్రబాబే ఆ హత్యను చేయించారని ఆరోపించారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని వాదించారు. వైఎస్ వివేకా కుమార్తె మాత్రం తన అన్న పాలనలో న్యాయం జరగడం లేదని.. సీబీఐ విచారణ కావాల్సిందేనని హైకోర్టుకు తెలిపింది. పోలీసులు ఈ కేసులో నిందితులను తేల్చక పోవడంతో కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

వివేకా కుమార్తె పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు బాధ్యతలు చేపట్టినట్లు ఎఫ్ఐఆర్‌‌లో పేర్కొన్న సీబీఐ రెండు విడతలుగా దర్యాప్తు చేసింది. అయితే సీబీఐ అధికారులకు కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన విచారణను కొత్త బృందంతో విచారణ చేయించనున్నారు. కేసును తేల్చాలని నిర్ణయించారు.

Also Read: ఏడాది వర్షం.. ఒక్క రోజులోనే కురిసిందా! షాకింగ్ నిజాలు

ఈ ఏజాది జూలై 9న సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక నేరాల విభాగం మూడో బ్రాంచికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతున్నా ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఆ కేసును ఎలాగైనా ఛేదించాలని సీబీఐ నిర్ధారించుకుంది. అందుకే మరో టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ టీమ్‌ అయినా త్వరగా దర్యాప్తు ముగించి కేసుకు ఓ పరిష్కారం చూపుతుందో చూడాలి మరి.