spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Employees PF Money: ఆ లెక్క సరిచేసేందుకు ‘జీపీఎఫ్’ నగదు మాయం.. ఉద్యోగుల్లో కలవరం

AP Employees PF Money: ఆ లెక్క సరిచేసేందుకు ‘జీపీఎఫ్’ నగదు మాయం.. ఉద్యోగుల్లో కలవరం

AP Employees PF Money: ఏపీలో 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు కలవరపాటుకు గురయ్యారు. వారి జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల నగదు మాయం కావడంతో ఆందోళనకు గురయ్యారు. సైబర్ నేరం జరిగి ఉంటుందని తొలుత అనుమానించారు. తీరా ప్రభుత్వమే నగదును విత్ డ్రా చేసిందని తెలియడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించక.. అన్నివిధాలా దగా చేసిన ప్రభుత్వం జీపీఎఫ్ ఖాతాలను ఖాళీ చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శిస్తున్నారు. కేసులు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇంటి అవసరాల కోసం వేలాది మంది జీపీఎస్ అడ్వాన్స్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత అవసరాలకు విడుదల కాని నిధులను, ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటున్నది ఉద్యోగుల ప్రశ్న.

AP Employees PF Money
AP Govt

గత రెండుసార్లు..
వాస్తవానికి డీఏ బకాయిలు ఉండిపోవడంతో ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం రెండు సార్లు.డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. కానీ వారికి తెలియకుండానే రెండు సార్లు ఖాతాల నుంచి మళ్లించింది. తాజాగా రెండు రోజుల కిందట నుంచి ఉద్యోగులకు మెసేజ్ లు వస్తున్నాయి. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు క్రెడిట్ అయినట్టు చూపిస్తోంది. అదే సమయంలో అకౌంటెంట్ జనరల్ గత ఏడాది జీపీఎఫ్ వార్షిక వివరాలు వెల్లడించింది. దానిని చూసుకున్న ఉద్యోగులు రెండు సార్లు నగదు క్రెడిట్ అయినట్టు గుర్తించారు. గతంలో ఒకసారి మళ్లించి తిరిగి చెల్లించినట్టు కూడా వెల్లడైంది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాము దాచుకున్న నగదుకు ప్రభుత్వం బ్యాంకర్ గా వ్యవహరించాలే తప్ప.. తమకు తెలియకుండా నగదు ఎలా మళ్లీస్తుందని ప్రశ్నించారు. దీనిపై అనుమానాలు పెరుగుతున్నాయని.. దీనిని నివ్రుత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందంటున్నారు.

Also Read: YCP Politics: వైసీపీలో ‘కుట్ర’ కోణాలు..! సంచలన అడజడులు

కంగారు వద్దంటున్న ప్రభుత్వం..
అయితే దీనిపై అంత కంగారు పడాల్సిన పనిలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి గత అనుభవాలను ఉదహరిస్తున్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు ఉండేది ప్రభుత్వ పీడీ అకౌంట్లలోనేనని..బ్యాంకుల్లో కాదన్న విషయం గుర్తించుకోవాలని చెబుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో ఉంటే ఇబ్బందులని.. ప్రభుత్వ సంరక్షణలో ఉంటే ఎటువంటి నష్టం ఉండదంటున్నారు.

AP Employees PF Money
AP Employees PF Money

సైబర్ నేరగాళ్ల బారిన చిక్కుకునే అవకాశం లేదంటున్నారు. దీంతో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు వాడుకున్నట్టు చెప్పకనే చెప్పింది. అలా వాడుకుంటే తప్పేమిటన్న ధోరణిలో వ్యవహరిస్తోంది. డీఏ బకాయిలతో పాటు ఇతరత్రా రాయితీలను ప్రభుత్వం నేరుగా జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇవన్నీ ప్రభుత్వ పీడీ అకౌంట్లలో ఉంటాయి. జీపీఎఫ్ కు ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తోంది. అటువంటప్పుడు నిధులు వినియోగించుకుంటే తప్పేమిటన్నది ప్రభుత్వ వాదన. దీనిని రుణ పరిమితి కింద కూడా చూపెడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కాగ్ వంటి సంస్థలకు లెక్కలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇతర రుణాలకు జీపీఎఫ్ ఖాతాల నుంచి నిధులను వినియోగిస్తోంది. అసలు అప్పులే లేవని బిల్డప్ ఇచ్చి రుణ పరిమితిని పెంచుకుంటోంది. పాలనలో ఇదో భాగమని… జీపీఎఫ్ నిధులు దుర్వినియోగం చేసే ఉద్దేశ్యం లేదని చెప్పుకొస్తోంది. సో దొంగ లెక్కలు చెప్పడానికి జీపీఎఫ్ నిధులు వినియోగించారన్న మాట.

Also Read:Mana Ooru Mana Badi Scheme: మన ఊరు మన బడి ఓ బడా కంపెనీకి

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper