Homeఆంధ్రప్రదేశ్‌PRC: పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందో?

PRC: పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందో?

PRC: పీఆర్సీపై ఉద్యోగులు మరోమారు ఉద్యమించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అల్టిమేటం జారీ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పీఆర్సీ ప్రకటన మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీఆర్సీపై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమవుతున్నారు. దీంతో పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Jagan
Jagan

పీఆర్సీ ప్రకటనపై కాలయాపన చేస్తుండటంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోతోంది. ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఉద్యోగ సంఘాల్లో ఆగ్రహం కలుగుతోంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని తెలుస్తోంది. ఫిట్ మెంట్ విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సయోధ్య కుదరడం లేదు.

Also Read:  అర్జున ఫల్గుణ’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. డిజాస్టర్లకే డిజాస్టర్

ప్రభుత్వం 14.29 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని చెబుతున్నా అంత అయితే కుదరదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనే 27 శాతం ఐఆర్ ప్రకటన ఇచ్చినా ప్రస్తుతం 45 శాతం ఇవ్వాలని పట్టుబడుతుండటంతో చిక్కుముడి వీడటం లేదు. తెలంగాణ 43 శాతం ఇవ్వడంతో కనీసం ఏపీ 45 శాతం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. అయితే 30 శాతం ఫిట్ మెంట్ కూడా ఇవ్వడానికి ఏపీ ససేమిరా అనడం ఆశ్చర్యకరం.

సీఎం జగన్ స్వయంగా సమీక్షలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల్లో ఎదురుచూపులే తప్ప పరిష్కారం మాత్రం కానరావడం లేదు. దీంతో పీఆర్సీ ప్రకటన ఎప్పుడు ప్రకటిస్తుందోననే సందేహాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఉద్యమించేందుకు కూడా ఉద్యోగులు సిద్ధమైనట్లుతెలుస్తోంది.

Also Read: తెలుగులో చేస్తున్న తొలి సినిమాకే ఆ హీరోకి 32 కోట్లు !

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version