spot_img
Homeజాతీయ వార్తలుఢిల్లీ పోలీస్ లకు క్లీన్ చిట్ ఇచ్చిన అమిత్ షా!

ఢిల్లీ పోలీస్ లకు క్లీన్ చిట్ ఇచ్చిన అమిత్ షా!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన హింసాయుత సంఘటనలు జరుగుతూ ఉంటె మూడు రోజుల పాటు కేంద్ర హోమ్ మంత్రిగా అమిత్ షా పట్టించుకోలేదని, ఢిల్లీ పోలీసులు ప్రేక్షక పాత్ర హించారని సర్వత్రా విమర్శలు చెలరేగుతున్న సమయంలో మొదటిసారిగా లోక్ సభలో హోమ్ మంత్రి పెదవి విప్పారు. ఒక విధంగా ఆత్మరక్షణలో పడిన ఆయన ఢిల్లీ పోలీసులకు `క్లీన్ చిట్’ ఇవ్వవలసి వచ్చింది.

తమ కళ్ళ యెదుటనే అసాంఘిక శక్తులు తుపాకులు కలుస్తూ, పొడవైన కత్తులతో రహదారులపై సవైరవిహారం చేస్తుంటే చూస్తూ ఉండిపోయిన పోలీసులను ఆయన వెనుక వేసుకు వచ్చారు. పైగా మూడు రోజులలో అల్లర్లను కట్టడి చేశారు అంటూ ప్రశంశ కురిపించారు.

అల్లర్లలో ఢిల్లీ పోలీసులకు ప్రమేయం ఉన్నట్లు వ్యాప్తి అవుతున్న వీడియోలను పరిశీలించామని, ఎక్కడా వారి పాత్ర కనిపించలేదని, పైగా అల్లర్లను అరికట్టడం కోసం వారు కృషి చేసిన్నట్లు వెల్లడి అయినదని అంటూ చెప్పుకు వచ్చారు.

జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ మూడోరోజు రాత్రి ఢిల్లీ వీధులలోకి వచ్చే వరకు పోలీసులు అల్లరి ముఖాలపై కాల్పులకు పాల్పడక పోవడం అందరికి తెలిసిందే. పైగా పోలిసుల నిష్క్రియతా పట్ల పరోక్షంగా స్వయంగా దోవల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

పైగా తానా ఆ సమయంలో ఢిల్లీలోనే ఉన్నానని, ఢిల్లీ పోలీసులతో సమీక్షలు జరుపుతూనే ఉన్నాను అని చెప్పుకొచ్చారు. మూడు రోజుల తర్వాతనే ఆయన ఢిల్లీ పోలీస్ చీఫ్, ఇతర ఉన్నత అధికారులతో సమావేశం కావడం అందరికి తెలిసిందే.

ఢిల్లీ పోలీసులు స్వయంగా తన అధీనంలో పనిచేస్తున్నా ఒక్క సారి కూడా అల్లర్లు జరిగిన ప్రాంతాలలో పర్యటించక పోవడాన్ని కూడా పోలిసుల దృష్టి మరలకుండా చేయడం కోసం అంటూ సమర్ధించుకున్నారు. బీజేపీ నాయకుల ద్వేష ప్రసంగాలను ప్రస్తావించకుండా గత డిసెంబర్ లో సోనియా గాంధీ చేసిన ప్రసంగాన్ని ఉదహరించారు. ఢిల్లీ పోలీసులకు బిజెపి నేత కపిల్ మిశ్ర అల్టిమేటం ఇచ్చిన తర్వాతనే ఈశాన్య అల్లర్లు ప్రారంభం కావడం అందరికి తెలిసిందే.

కపిల్ మిశ్రతో పాటు ద్వేష ప్రసంగాలు చేసిన ఇతర పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్వయంగా ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోస్ తివారి డిమాండ్ చేశారు. పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా కోరారు. చివరకు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, అనురాగ్ ఠాకూర్, యుపి ముఖ్యమంత్రి స్వామి చినయానంద వంటి వారు సహితం అదుపుతప్పి ప్రసంగాలు చేశారు.

తన వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడం కోసం నేరమయ ధోరణి ప్రదర్శించిన ఢిల్లీ పోలీసులకు `క్లీన్ చిట్’ ఇవ్వక అమిత్ షా కు తప్పిన్నట్లు లేదు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version