Homeజాతీయ వార్తలుRailway Passengers: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి టికెట్ రిజర్వేషన్ లో భారీ...

Railway Passengers: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి టికెట్ రిజర్వేషన్ లో భారీ మార్పు..

Railway Passengers: తక్కువ ఖర్చులో సుదూరం ప్రయాణించడానికి రైలు ప్రయాణమే ఉత్తమమైన మార్గం. కొన్ని ప్రాంతాల్లో కేవలం రైలు ప్రయాణాలపైనే ఆధారపడతారు. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఎలాంటి అలసట ఉండదు. అంతేకాకుండా చార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. ఎంత దూరమైనా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే రైలు ప్రయాణం చేసే సమయంలో రైల్వే బోర్డ్ విధించే నిబంధనలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల నియమాలను రైల్వే బోర్డ్ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా టికెట్ల బుకింగ్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను తీసుకొస్తుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరి ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకోవడానికి మూడు నెలల ముందే సెర్చ్ చేస్తూ ఉండాలి. ఈ సమయంలో ఏ ట్రైన్ అవైలబుల్ ఉందో దానిని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుపతి, ముంబై, ఢిల్లీ వంటి ముఖ్యమైన ప్రాంతాలకు నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ రూట్లో ఎప్పుడూ టికెట్ల డిమాండ్ ఉంటుంది. ఆయా రూట్లో రిజర్వేషన్ టికెట్స్ రిలీజ్ చేసిన వెంటనే బుకింగ్ అయిపోతాయి. అయితే కొందరు అక్రమార్కులు కొన్ని సాఫ్ట్వేర్ల ద్వారా ఈ టికెట్లను బుక్ చేసి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు వీటిని దక్కించుకునే అవకాశం లేకుండా పోయింది.

అయితే ఈ సమస్యను గుర్తించిన రైల్వే బోర్డ్ తాజాగా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఎవరైతే రైల్వే టికెట్ బుక్ చేసుకుంటారో.. వారి ఆధార్ అతెంటికేషన్ తప్పనిసరిగా చేసింది. అంటే ప్రయాణికులు ఎవరైనా IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలని అనుకుంటే తమ ఆధార్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఇప్పటివరకు తత్కాల్ టికెట్లకు ఉంది. ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ టికెట్లకు కూడా వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా సాధారణ ప్రయాణికులు సైతం సొంతంగా టికెట్ బుక్ చేసుకుని అవకాశం ఉంటుంది. ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది.

ఉదాహరణకు తిరుపతికి వెళ్లాలని అనుకునే వారు 60 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే.. తమ ఆధార్ ను తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కొందరు ట్రావెల్స్ ఏజెన్సీలు టికెట్లను పక్కదారి పట్టించే అవకాశం ఉండదు. అంతేకాకుండా సాధారణ ప్రయాణికులు సైతం నేరుగా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్ బుకింగ్ లో ఆధార్ అథెంటికేషన్ లేకపోవడంతో కొంతమంది ఎక్కువగా టికెట్స్ బుక్ చేసుకుని ఇతరులకు బ్లాక్ లో అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి కొత్తగా ఈ నిబంధనలు తీసుకొచ్చింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version