
ముంబై కి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి ఒక గుహలో తలదాచుకున్నాడు. తాజాగా అతనిని గుర్తించి తన వాళ్ళ దగ్గరకు పంపిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… ముంబై కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వీరేంద్ర సింగ్ డోగ్రా అమర్ కంటక్ నుంచి గుజరాత్ వరకూ నర్మదా నదీపరీవాహక ప్రాంతంలో (దేశంలోనే ప్రసిద్ధమైన ‘నర్మదా పరిక్రమణ’) పర్యటన చేస్తూ చేస్తూ…. మధ్యప్రదేశ్ చేరుకున్నారు. అనుకోకుండా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దింతో అతను ఎటూ వెళ్లలేకపోయాడు ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని రైసెన్ జిల్లాలోని ఒక గుహలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మార్చి 24 నుంచి అతను ఆ గుహలోనే ఉన్నాడు.
గత ఆదివారం పశువుల కాపర్లు ఆ దారిలో వెళ్తుండగా… ఆ యువకుడ్ని చూసి… వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆయన్ని ప్రశ్నించగా… తాను ముంబైకి చెందినవాడినని చెప్పి, హైదరాబాదులో ఉంటున్న తన సోదరికి పోలీసులతో ఫోన్ చేయించాడు. ఆ తర్వాత అతనిని కందర్వి గ్రామంలోని బంధువు ఇంటికి తరలించారు.