Homeజాతీయ వార్తలుPM Modi: ప్రధాని నివాసం పైన డ్రోన్ల చక్కర్లు.. రంగంలోకి ఎస్పిజి

PM Modi: ప్రధాని నివాసం పైన డ్రోన్ల చక్కర్లు.. రంగంలోకి ఎస్పిజి

PM Modi: ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రధాని నివాసం పైనుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. ఫలితంగా ప్రధానమంత్రి భద్రత వ్యవహారాలు పరిశీలించే ఎస్పీజీ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. ఈ వార్త వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది.

ఢిల్లీలో ప్రధానమంత్రి అధికారిక నివాసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. ప్రధానమంత్రి నివాస పరిసర ప్రాంతాలను భద్రతాధికారులు “నో ఫ్లయింగ్ జోన్ ” గా ప్రకటించారు. అంటే ఇక్కడ ఎటువంటి ఎగిరే వస్తువులను ప్రయోగించకూడదు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ నిబంధన అమల్లో ఉంది. గత ఏడాది పంజాబ్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వెళ్లిన ప్రధానమంత్రిని ఖలిస్తాన్ వేర్పాటువాదులు అడ్డగించినప్పుడు దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. దీంతో అప్పటినుంచి ప్రధానమంత్రి అధికారిక నివాస పరిసర ప్రాంతాల్లో భద్రత అధికారులు మరింత కట్టుదిట్టంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారస పడితే వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సోమవారం ప్రధానమంత్రి అధికారిక నివాసం మీద నుంచి డ్రోన్లు నాలుగైదు సార్లు చక్కర్లు కొట్టాయి. పైగా వాటి ద్వారా ఫోటోలు తీశారని భద్రత దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక ఈ డ్రోన్లు చక్కర్లు కొట్టిన విషయాన్ని గుర్తించిన ప్రధానమంత్రి భద్రతా అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ వ్యక్తులు వాటిని ప్రయోగించారు? అసలు వారి లక్ష్యం ఏమిటి? డ్రోన్లు కేవలం ఫోటోలు మాత్రమే తీశాయా? లేక ఇంకేమైనా లక్ష్యాల కోసం వాటిని ఉపయోగించారా? అనే కోణాల్లో భద్రత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.. చైనా, పాకిస్తాన్ దేశాలతో భారత్ సరిహద్దు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఏమైనా డ్రోన్లు ప్రయోగించారా అని భద్రత అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇటీవల ఒక నిఘా బెలూన్ ను చైనా దేశం అమెరికా మీద ప్రయోగించిన నేపథ్యంలో.. ఆ దేశపు నిఘా సంస్థ ఏమైనా డ్రోన్ ప్రయోగించిందా అనే సందేహాలను కూడా నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా వీటికి సంబంధించిన దర్యాప్తును భద్రత అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Oktelugu Epaper
Exit mobile version