ప్రజలకు మేలు చేసే సీఎం జగన్ నిర్ణయం

ఏపీ సీఏం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైద్యరంగం బలోపేతానికి పెద్ద పీట వేస్తున్నారు . ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం చేరువ చేసేందుకు ప్రతి 2500 మంది జనాభాకు ఒక విలేజ్ క్లినిక్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రాష్ట్రంలో 560 వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌ల ఏర్పాటుకు జగన్ సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 331 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయు. వీటిని వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌గా […]

Written By: Suresh, Updated On : November 25, 2020 11:00 am
Follow us on

ఏపీ సీఏం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైద్యరంగం బలోపేతానికి పెద్ద పీట వేస్తున్నారు . ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం చేరువ చేసేందుకు ప్రతి 2500 మంది జనాభాకు ఒక విలేజ్ క్లినిక్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రాష్ట్రంలో 560 వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌ల ఏర్పాటుకు జగన్ సర్కార్ ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 331 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయు. వీటిని వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌గా మార్చడంతో పాటు కొత్తగా 229 అర్బన్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నారు. కాగా మొత్తం 560 క్లినిక్‌లలో 355 క్లినిక్‌లకు కొత్త భవనాలు నిర్మించాలన్న ఏపీవీవీపీ కమిషనర్‌ చేసి న ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు సోమవారం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న 355 భవనాలతోపాటు మిగిలిన 229 భవనాల మరమ్మతు, ఫర్నిచర్‌, వైద్య పరికరాల కొనుగోలు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.416.50 కోట్లు విడు దల చేయనుంది.

రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పేరు మీద “వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌”లు ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. క్లీనిక్‌ల కోసం 355 కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 205 భవనాలకు మరమ్మతులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్‌ క్లినిక్‌ల నిర్మాణానికి జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ఆరోగ్యశాఖ నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఈ అర్బన్ క్లినిక్‌లు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ తరహాలో ఉంటాయి.

ఢిల్లీలో సామాన్య ప్రజలు జ్వరం, చిన్నాచితక రోగాలు వస్తే ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. పేదలకు వైద్యం భారం కావొద్దనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మొహల్లా క్లినిక్‌లు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)ను ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉండదు. అంతే కాదు మందులు, వైద్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తారు. ఇదే తరహాలో ఏపీలోనూ వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లు పని చేస్తాయి. ఇవి ప్రస్తుతం ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు.