Homeజాతీయ వార్తలుRajya Sabha: ఇక బిల్లులకు నో ఫియర్.. రాజ్యసభ లోను బీజేపీ కి పవర్..!

Rajya Sabha: ఇక బిల్లులకు నో ఫియర్.. రాజ్యసభ లోను బీజేపీ కి పవర్..!

Rajya Sabha: దేశంలో వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. గతంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రికార్డును సమం చేసింది. ఇక నరేంద్రమోదీ.. ప్రధానిగా వరుసగా మూడుసార్లు ఎన్నికై పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. 2000 సంవత్సరం నుంచి బీజేపీకి దేశంలో ఆదరణ పెరుగుతూ వస్తోంది. 1999లో వాజ్‌పేయ్‌ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా 13 రోజులకే పడిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో బలమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఇక 2014 నుంచి ఎన్డీఏకు తిరుగులేకుండా పోయింది. అయితే లోక్‌సభలో మెజారిటీ సీట్లు గెలుస్తున్న బీజేపీకి రాజ్యసభలో మాత్రం మెజారిటీ లేదు. దీంతో బిల్లుల ఆమోదానికి మిత్రపక్షాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. కానీ, మోదీ కృషితో తాజాగా రాజ్యసభలోనూ ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. తాజాగా 12 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 21వరకు నామినేషన్లు స్వీకరించగా, తొమ్మిది స్థానాల్లో బీజేపీ రెండు స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్‌ఎల్‌ఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎగువ సభలో మెజారిటీ మార్కు..
ఎన్డీఏకు ఎగువ సభలో మెజార్టీ మార్కును అందుకుంది. తాజాగా రాజ్యసభలో బీజేపీ బలం 96కి చేరగా, మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ ఆ బలం 112కు పెరిగింది. దీనికితోడు అధికార పార్టీకి ఆరుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది. తాజాగా కాంగ్రెస్‌ నుంచి ఒక సభ్యుడు గెలుపొందడంతో రాజ్యసభలో ప్రతిపక్షాల బలం 85కి పెరిగింది.

బిల్లల ఆమోదానికి ఇబ్బంది..
రాజ్యసభలో బీజేపీకి గత నెల వరకు బీజేపీకి 86 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే బలం 101. రాజ్యసభలో మెజార్టీ మార్కు 114 కాగా.. అందుకు సరిపడా ఎంపీలు అధికార కూటమికి లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో బిల్లులు ఆమోదం కోసం కేంద్రం మిత్ర పక్షాలతోపాటు తటస్థ పార్టీలపై ఆధారపడాల్సి వచ్చేది. తాజాగా జరిగిన 12 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ 2, మిత్రపక్షాలు 9 సీట్లు గెలిచాయి. దీంతో ఎన్డీ బలం 112కు చేరింది. ఆరుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper