కల్లు తాగేవారందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిదీ..

కల్లు.. దీన్నే సురాపానం అంటారు.. గ్రామాల్లోకి వెళితే చెరువు గట్టున, వాగు గట్టున ఈత, తాటిచెట్లు కనిపిస్తాయి.. అక్కడ ప్రతిరోజు  కల్లు తాగేవారు అని మనకు ఎంతో మంది కనిపిస్తుంటారు..  అయితే చాలా మంది పెద్దలు గ్రామాల్లో బ్రాండీ విస్కీ బీరు తాగవద్దని చెబుతూ కల్లు మాత్రం విరివిగా తాగండని సూచిస్తారు. అందుకే ఎందుకో ఇప్పటివారికి అర్థం కాదు.. కానీ కల్లులో చాలా పోషకాలున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది.. తాటిచెట్టు కల్పవృక్షమే… నాన్నలు, తాతలు చెప్పినట్టు కల్లు […]

Written By: NARESH, Updated On : November 8, 2020 6:24 pm
Follow us on

కల్లు.. దీన్నే సురాపానం అంటారు.. గ్రామాల్లోకి వెళితే చెరువు గట్టున, వాగు గట్టున ఈత, తాటిచెట్లు కనిపిస్తాయి.. అక్కడ ప్రతిరోజు  కల్లు తాగేవారు అని మనకు ఎంతో మంది కనిపిస్తుంటారు..  అయితే చాలా మంది పెద్దలు గ్రామాల్లో బ్రాండీ విస్కీ బీరు తాగవద్దని చెబుతూ కల్లు మాత్రం విరివిగా తాగండని సూచిస్తారు. అందుకే ఎందుకో ఇప్పటివారికి అర్థం కాదు.. కానీ కల్లులో చాలా పోషకాలున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది.. తాటిచెట్టు కల్పవృక్షమే… నాన్నలు, తాతలు చెప్పినట్టు కల్లు తాగితే చాలా మంచిదే..  తాటికల్లు సుమధురమైన దివ్యౌషధమే.  తాటి వృక్షం ప్రసాదించే కల్లు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది తాజా పరిశోధనల్లో వెల్లడైన సత్యం. మోతాదులో సేవిస్తే ఈ పానీయం ఆయురారోగ్యాలకు రక్షగా నిలుస్తుంది. శరీరానికి జవసత్వాలను అందజేస్తుంది. బహుశా ఈ సత్యాన్ని గుర్తించి కాబోలు.. తెలంగాణ, ఏపీలో పూర్వకాలంనుంచే పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం ప్రత్యేక సందర్భాల్లో దీన్ని సేవిస్తూ వచ్చారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

తెలంగాణ పల్లెల్లో విరివిగా లభించే తాటికల్లుపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) పరిశోధన చేసి ఇందులో ఉన్న పోషక విలువలను గుర్తించింది. ఇటీవల ఈ సంస్థ జాతీయ స్థాయిలో విడుదల చేసిన కాంపోజిషన్ పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించింది. తాటికల్లులో ఐరన్, కాల్షియం వంటి పదార్ధాలు సమృద్ధిగా ఉన్నాయని, ఇవి ఎముకల పటిష్టానికి, రక్త వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది. ముఖ్యంగా తాటికల్లులో  దేహానికి అవసరమైన పోషకాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే గాకుండా రోగాలు రాకుం డా కాపాడుతుంది.

Also Read: బీజేపీలోకి రాములమ్మ.. ముహుర్తం ఖరారైందా?

ఇక జాతీయ పోషకాహార సంస్థ  తాటికల్లులో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని, ఇది షుగర్ వ్యాధిగ్రస్థులకు మేలుచేస్తుందని తెలిపింది. మినరల్స్, విటమిన్స్ ఆరోగ్య సమతుల్యతకు దోహ దం చేస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఇందులో లభించే ఫ్యాంటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వు పెరుగకుండా నివారిస్తాయి.  ఇక ఇందులోని విటమిన్ సీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తాటికల్లుకు సంబంధించిన డాటాను వివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాటి కల్లులో వాటర్ సాల్యూబుల్ విటమిన్స్‌లో థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, ప్యాంటాసిడ్, విటమిన్ సీ వంటి విటమిన్లు ఉండగా, ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్స్ కూడా ఉన్నాయి. కెరోటెనాయిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా శరీరంలో కొవ్వును నియంత్రించే సాచ్యురేచ్‌డ్ ఫ్యాటీ ఆసిడ్స్(టీఎస్‌ఎఫ్‌ఏ), మోనో ఆన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్(టీఎంయుఎఫ్‌ఏ), పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్(టీపీయుఎఫ్‌ఏ)ఉన్నాయి.

అయితే పట్టణాల్లో కల్తీ కల్లు వల్ల ప్రజలకు ఈ ఔషధం క్రమంగా దూరం అవుతోంది. అయితే వాస్తవంలో మార్కెట్లో లభించే అనేక పానీయాలకన్నా కల్లు ఎంతో మేలైంది.
ఇందులోని ఔషధ గుణాలు గుర్తించినందువల్లనే తెలంగాణలో పూర్వకాలంనుంచి చిన్న పిల్లలకు కూడా దీన్ని వాడుతూ వచ్చారు. కల్లు మత్తుపదార్థం అనే దుష్ప్రచారాలు జరిగాయి. తాటిచెట్టు వద్ద సకాలంలో దింపిన కల్లు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఏదీ అతిగా తీసుకున్నా క్షేమకరం కాదు. ఇది ఔషధానికైనా, తాటికల్లుకైనా వర్తిస్తుంది. అదేపనిగా మోతాదుకు మించి సేవిస్తే ఏదైనా అనారోగ్యానికే దారితీస్తుంది.

Also Read: చంద్రబాబుకు మరో షాక్.. టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై

పరిశోధనల్లో తేలిన ప్రకారం ఆరోగ్యానికి మేలు చేసే మినరల్స్..
తాటికల్లు: 5.73
కొబ్బరి నీళ్లు : 3.06