Zodiac Signs : 29 రోజుల్లో ఈ రాశుల వారి ఆస్తి రెట్టింపవుతుంది?

శుక్రుడు ఆనందం, ఆభరణాలు, సౌఖ్యాలు ఇస్తుంటాడు. ఎవరి జాతకంలో శుక్రుడు ఆధిపత్య స్థానంలో ఉంటాడో వారికి అధిక లాభాలు చేకూరుతాయి. దీంతో వారి అదృష్టం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

Written By: Srinivas, Updated On : June 11, 2023 6:00 pm
Follow us on

Zodiac Signs : మే 30న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో మూడు రాశులకు ప్రయోజనం కలగనుంది. దీంతో వారికి అన్ని మంచి శకునాలే. వారికి అదృష్ట యోగం పట్టనుంది. శుక్రుడు ఆనందం, ఆభరణాలు, సౌఖ్యాలు ఇస్తుంటాడు. ఎవరి జాతకంలో శుక్రుడు ఆధిపత్య స్థానంలో ఉంటాడో వారికి అధిక లాభాలు చేకూరుతాయి. దీంతో వారి అదృష్టం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

శుక్రుడు కర్కాటక రాశిలోని రావడంతోనే మూడు రాశులపై ప్రభావం చూపుతున్నాడు. ఈ కాలంలో వారు అనుకున్నది సాధించే శక్తి లభిస్తుంది. ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకుని అనుకూల ప్రభావాలు కలిగి ఉంటారు. ఇందులో మూడు రాశులు ఉన్నాయి. మేష రాశి, మిథున రాశి, మీన రాశులు ఈ కోవలో ఉన్నాయి. దీంతో వీరికి ఎంతో శుభ ఫలితాలు రానున్నాయి.

మేష రాశి వారికి చాలా ప్రయోజనాలు దక్కనున్నాయి. ఊహించని విధంగా డబ్బు వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. పెద్ద కాంట్రాక్టులు దొరుకుతాయి. ఆగిపోయిన పనులు మొదలవుతాయి. విజయం, గౌరవాలు లభిస్తాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునే సమయం కూడా వస్తుంది. దీంతో ఈ రాశి వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

మిథున రాశి వారికి మంచి ఫలితాలు వస్తున్నాయి. సంపదలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. విదేశీ పర్యటనకు అవకాశం ఉంది. మీన రాశి వారికి లాభాలు వస్తాయి. వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రావచ్చు. మీడియా రంగంలో ఉన్న వారికి మరింత ప్రయోజనాలు దక్కనున్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.