spot_img
Homeహెల్త్‌IRCTC Train  Insurance : 35 పైసలతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. వెంటనే తెలుసుకోండి..

IRCTC Train  Insurance : 35 పైసలతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. వెంటనే తెలుసుకోండి..

IRCTC Train  Insurance  : కరోనా కాలం తరువాత మనిషి జీవితం మారిపోయింది. ముఖ్యంగా ఆరోగ్యం జీవనానికి సంబంధించి చాలా మంది కేర్ తీసుకుంటున్నారు. ఎవరికి? ఎప్పుడు? ఎలాంటి ఆపద వస్తుందోనని చాలా మంది భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కుటుంబ పెద్ద మరణిస్తే తన కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితిని కొన్ని వార్తల ద్వారా చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో చాలా మంది కుటుంబ భద్రత కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోయింది. అయితే కొన్ని ఇన్సూరెన్స్ లు చాలా తక్కువ ఖర్చుకే కొనుగోలు చేయొచ్చు. వీటి ద్వారాపెద్ద మొత్తంలో ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు ఓ ఇన్సూరెన్స్ కు 35 పైసలు చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. అదెంటో తెలుసా?

కొంత మందికి ట్రైన్ జర్నీ చేయడం చాలా ఇష్టం. మిగతా ప్రయాణాల కంటే రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే రైలు ప్రయాణం చేసే ముందు ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఇక్కడ కింద బాక్స్ లో ఓ ఇన్సూరెన్స్ గురించి వివరాలు ఉంటాయి. అయితే దీని గురించి చాలా మంది పట్టించుకోరు. దీని ప్రకారం 35 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. ట్రైన్ లో జర్నీ చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతంది.

ట్రైన్ టికెట్ తీసుకునేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆన్ లైన్ లో బాండ్ ఇస్తారు. దీని ప్రకారం రైలు ప్రయాణం చేసే సమయంలో ఏదైన ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షల వరకు కుటుంబానికి చెల్లిస్తారు. అలాగే పూర్తిగా అవయవాలు పనిచేయని పక్షంలోనూ ఇంతే మొత్తం చెల్లిస్తారు. ఇక తీవ్రంగా గాయాలైతే రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఈ ప్రమాదం జరిగిన నాలుగు నెలల తరువాత క్లెయిమ్ చేసుకుంటే 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ మొత్తం కవర్ అవుతుంది.

రైలు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఈ ఇన్సూరెన్స్ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని సాధారణ ఇన్సూరెన్స్ లో యాక్సిడెంట్ పాలసీలు ఉన్నా రైలు ప్రమాదంలో వాటి పరిధిలోకి రావు. ఇలాంటప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కేవలం 35 పైసలు చెల్లిస్తే చాలు భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ వస్తుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న తరువాత ఆన్ లైన్లో వచ్చిన బాండ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ తరువాత క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. రైలు ప్రయాణాలు చేసే సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ట్రైన్ యాక్సడెంట్ లో 15 మందికిపైగా మరణించారు. అందువల్ల ముందే ఇన్సూరెన్స్ తీసుకుంటే కుటుంబ పెద్ద భారం ఆ కుటుంబం పడకుండా ఈ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. పైగా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెద్దగా లేకపోవడంతో ఈసారి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని మరిచిపోకండి..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version