ఖజానా కల్లాస్‌ : రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌తో రూ.30 వేల కోట్ల నష్టం

‘ఒక్క చిన్న తప్పిదం.. వేల కోట్ల నష్టం..’ ఇదీ ప్రస్తుతం తెలంగాణ సర్కార్‌‌ వైఫల్యం. సాధారణంగా ప్రభుత్వానికి మద్యం, రిజిస్ట్రేషన్లతోనే ఆదాయం వస్తుంటుంది. కానీ.. తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయంతో భారీ నష్టం చవిచూడాల్సి వచ్చింది. ప్రభుత్వంతో పాటే ఆ రంగంపై ఆధారపడిన కుటుంబాలూ ఆగమాగం అయ్యాయి. ఫలితంగా మూడు నెలల్లో రూ.30 వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. Also Read: 14 సంవత్సరాలుగా అన్నం తినని బాలిక.. ఎలా బ్రతుకుతోందంటే..? తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ […]

Written By: NARESH, Updated On : December 27, 2020 5:06 pm
Follow us on


‘ఒక్క చిన్న తప్పిదం.. వేల కోట్ల నష్టం..’ ఇదీ ప్రస్తుతం తెలంగాణ సర్కార్‌‌ వైఫల్యం. సాధారణంగా ప్రభుత్వానికి మద్యం, రిజిస్ట్రేషన్లతోనే ఆదాయం వస్తుంటుంది. కానీ.. తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయంతో భారీ నష్టం చవిచూడాల్సి వచ్చింది. ప్రభుత్వంతో పాటే ఆ రంగంపై ఆధారపడిన కుటుంబాలూ ఆగమాగం అయ్యాయి. ఫలితంగా మూడు నెలల్లో రూ.30 వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Also Read: 14 సంవత్సరాలుగా అన్నం తినని బాలిక.. ఎలా బ్రతుకుతోందంటే..?

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ రిజిస్ట్రేషన్లలో ప్రత్యేకత ఉండాలని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ధరణి పేరిట రిజిస్ట్రేషన్లు చేయాలని తలిచారు. ఇందుకోసం రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. ఏకంగా వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారు. ఇంకేముంది ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోతాయని కేసీఆర్‌‌ అనుకున్నారు. కానీ.. ఆ నిర్ణయం మొదటికే మోసం తెస్తుందని బహుషా ఆయన కూడా ఊహించి ఉండరేమో. ధరణి కాస్త రిజిస్ట్రేషన్ల రంగంపై ఆధారపడిన వారి పట్ల దరిద్రమైంది. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కరువైంది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో డైరెక్ట్‌గా రియల్ఎస్టేట్, కన్ స్ట్రక్షన్, బ్యాంకింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇన్డైరెక్ట్‌గా అనేక అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ 7న గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను బంద్చేయించింది. ధరణి పోర్టల్ ద్వారానే అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రకటించింది. అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ అక్టోబర్ 29న ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి స్లాట్ బుకింగ్ మొదలైంది. కానీ.. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఈ నెల 14 నుంచి మొదలు పెట్టినా.. ఇంకా గాడిన పడలేదు.

నెలనెలా ప్రభుత్వానికి 700 కోట్ల ఇన్‌కం
రిజిస్ట్రేషన్లు బంద్కావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా  దెబ్బతీసింది. ప్రతినెలా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి సగటున రూ.700 కోట్ల ఆదాయం వచ్చేది. ఈ ఆదాయం పరోక్షంగా వివిధ రంగాల్లో ప్రతినెలా 10 వేల కోట్ల వరకు రొటేషన్ జరిగేదని ప్రభుత్వ వర్గాల భోగట్టా. రిజిస్ట్రేషన్లు మూడు నెలలపాటు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థ రూ.30 వేల కోట్లు  లాస్ అయిందని అంటున్నాయి. రిజిస్ట్రేషన్ సేవలు ఆగడంతో ఏయే రంగాలపై ప్రభావం పడింది? ఎంత మేరకు నష్టం వాటిల్లింది? అనే విషయాలపై కీలక ఆఫీసర్లు లెక్కలు తీసినట్టు తెలిసింది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్తో పాటు వాటి అనుబంధ రంగాల్లో ఎలాంటి పరిస్థితి ఉందని, కార్మికులు ఏ పనులు చేస్తున్నారనే దానిపై వారు సమాచారం సేకరిస్తున్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్లు ప్రారంభించినా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  141 సబ్ రిజిస్ట్రర్ ఆఫీసుల్లో రోజుకు 24 స్లాట్ల చొప్పున మొత్తం 3,384 రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ రోజుకు మొత్తంగా 100 రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు.

డీలా పడిన బ్యాంకింగ్‌
రాష్ట్రంలో మెజార్టీ పీపుల్‌ హౌస్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నారు. 90 శాతం మంది బ్యాంకు లోన్లతోనే ఇండ్లు, ఫ్లాట్స్  కొనుగోలు చేస్తుంటారు. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు లేకపోవడం  బ్యాంకింగ్ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపింది. ఆస్తి రిజిస్ట్రేషన్ తర్వాతే బ్యాంకులు లోన్ అమౌంట్‌ను  విడుదల చేస్తుంటాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ప్రకారం శాంక్షన్ చేసిన లోన్‌కు 45 రోజుల్లో కస్టమర్లు రిజిస్ట్రేషన్  డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే బ్యాంకులు అమ్మకందారులకు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. కానీ.. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ లేకపోవడంతో లోన్ కోసం మళ్లీ అప్లయ్చేసుకోవాలని బ్యాంకులు అంటున్నాయి.

Also Read: పనిలో ఉన్నప్పుడు తాగొద్దు.. అధికారులపై నోరుజారిన మంత్రి ఎర్రబెల్లి

దెబ్బతిన్న ఇండస్ట్రీలు
రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో నిర్మాణ రంగం కూడా కుదేలైంది. ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో ఆ రంగంపై ఆధారపడిన 15 లక్షల  మంది కార్మికులకు ఉపాధి కరువైంది. ఐరన్, సిమెంట్ ఇండస్ట్రీలపైనా రిజిస్ట్రేషన్ల బంద్ ఎఫెక్ట్ చూపింది. రాష్ట్రంలోని, పొరుగు రాష్ట్రాలకు చెందిన సిమెంట్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను తగ్గించినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తిలో మెజార్టీ భాగాన్ని రాష్ట్రంలోని భవన నిర్మాణాలకు సరఫరా చేస్తుంటాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు లేకపోవడంతో స్టీల్ డీలర్లు అమ్మకాలు ఆగిపోయాయి. ఇసుక, ఇటుక రవాణా కూడా నిలిచిపోయింది. రాష్ట్రంలోని ఇసుక క్వారీల నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే నిర్మాణ పనులకు ఇసుకను ట్రాన్స్ పోర్టు చేస్తుంటారు. లాక్ డౌన్ తర్వాత టన్ను ఇసుక రూ. 3,500 ధర పలికేది. కానీ ఇప్పుడు రూ.1,350 ధరకు కూడా ఎవరూ కొంటలేరు.

ఎలక్ట్రికల్.. ప్లంబింగ్‌.. కార్పెంటర్‌‌..
రిజిస్ట్రేషన్లు లేక ఇండ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీపై ప్రభావం పడింది. ఎలక్ట్రీషియన్లు ఉపాధి కోల్పోయారు. ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, ఇంటీరియర్ వర్క్స్ పై ఎఫెక్ట్  పడింది. ఈ రంగాల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు.  కొత్త నిర్మాణాలు జరిగితేనే కార్మికులకు ఉపాధి ఉంటుంది. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లు, అపార్ట్ మెంట్లలోని ఫ్లాట్లకు అమ్మకాలు లేవు. దీంతో కొత్త  నిర్మాణాలను బిల్డర్లు చేపట్టడం లేదు.

ఇప్పుడు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
‘అన్నీ కాలాక ఆకులు పట్టకున్న చందంగా’ ఉంది తెలంగాణ సర్కార్‌‌ పరిస్థితి. ఓవైపు ధరణి అంటూ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యాప్‌ కాస్త హ్యాండ్‌ ఇవ్వడంతో ఇప్పుడు సర్కార్‌‌ దిగొచ్చింది. నాన్‌ అగ్రికల్చర్‌‌ ఆస్తులకు ఎట్టకేలకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నడుస్తాయని ప్రకటించింది. అంతకుముందు ధరణి పోర్టల్‌ను నిరసిస్తూ రియల్టర్లు, ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసనలు ఎదురయ్యాయి. మరోవైపు.. పోర్టల్‌లోనూ సమస్యలు రావడంతో సర్కార్‌‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆర్డర్లు రావడం లేదు.. పేమెంట్లు ఇవ్వడం లేదు..
మూడు నెలలపాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బిల్డర్లు ఎవరూ మెటీరియల్ ఆర్డర్లు ఇవ్వలేదు. ఈ బిజినెస్‌లో ఎక్కువగా ఉద్దెర పద్ధతి నడుస్తుంటుంది. కానీ, రెండు నెలల్లోనే పేమెంట్ క్లియర్ చేస్తుంటారు. అయితే.. రిజిస్ట్రేషన్లు లేక షాపుల వాళ్లకు కూడా గిరాకీ దెబ్బతింది. దీనికితోడు పాత పేమెంట్స్కూడా రావడం లేదట.

-శ్రీనివాస్.బి

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్