Tollywood Heroes: ప్రస్తుతం ఇండియాలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి…NEET ఎగ్జామ్ పేపర్ లీకేజి కారణం గా డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇందులో చాలా మంది స్టూడెంట్స్ కి దెబ్బలు తగిలాయి…నిజానికి ఈ విషయం మీద ఇండియాలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ స్పందించాయి. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ధర్నాలు చేస్తున్నారు… ఇక దీనిమీద బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ హీరోలు స్పందించారు. అలాగే నిన్న తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లు, హీరోలు కూడా ధర్నా చేపట్టారు…
ముఖ్యంగా కమల్ హాసన్, వెట్రీ మారన్, పా.రంజిత్ లాంటి దర్శకులు పాల్గొని నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలని విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు అంటూ వాళ్ళు తమ నిరసన ను వ్యక్తం చేశారు… ఇక ఇంత జరుగుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఏ ఒక్క హీరో కూడా స్పందించడం లేదు.
దీంతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందిస్తూ ఒక ట్వీట్ చేశాడు… విద్యార్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని, స్టూడెంట్స్ సక్సెస్ సాధిస్తే అది ప్రభుత్వం సాధించిన విజయం అని రాశాడు. ఇక దీనిమీద కొంతమంది కొన్ని రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
ఏది ఏమైనా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ హీరోలెవరు స్పందించకపోవడంతో మన హీరోలను విమర్శిస్తూ ఇతర భాషల ప్రేక్షకులు హీరోలు కూడా చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు… మొత్తానికైతే మన హీరోల మౌనం వెనక కారణం ఏంటి..? ఇప్పటికైనా మనవాళ్ళు స్పందించకపోతే మన హీరోల మీద ఉన్న ఇంప్రెషన్ పోయే ప్రమాదం ఉందని మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే ఈ ధర్నాలు నిరసనలు ఎప్పుడూ తగ్గుముఖం పడతాయో చూడాలి…







