Samantha: సమంతతో పాటు తిరుపతికి వెళ్ళిన ఈమె ఎవరు? సమంత తనకు సంబంధం ఏంటి?

Samantha: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సమంత విడాకుల తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అయితే సమంత తరచూ తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. సమంత నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఆమె తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇదివరకే సమంత నటించిన మజిలీ, ఓ బేబీ సినిమాలు విడుదలకు […]

Written By: Navya, Updated On : December 13, 2021 11:43 am
Follow us on

Samantha: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సమంత విడాకుల తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అయితే సమంత తరచూ తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. సమంత నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఆమె తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం అలవాటుగా మారిపోయింది.

Samantha

ఇదివరకే సమంత నటించిన మజిలీ, ఓ బేబీ సినిమాలు విడుదలకు మూడు నాలుగు రోజులు ముందుగా తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న సమంత నేడు మరొక సారి స్వామివారి దర్శనానికి తిరుపతి వెళ్లారు. డిసెంబర్ 17వ తేదీ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదల కావడంతో, ఇందులో సమంత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 17 న విడుదల కావడంతో సమంత తిరుపతికి వచ్చినట్లు తెలుస్తోంది. సామాన్య భక్తులతో కలిసి మహాలఘులో శ్రీవారిని దర్శించుకున్న సమంతకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ ఎలిమినేట్ … అతను అన్నిట్లో డ్రామా చేస్తాడంటూ

ఇక సమంత తిరుపతికి తనతోపాటు మరొక ఆవిడతో కలిసి వెళ్ళింది. ఇంతకీ ఆమె ఎవరు ఏమిటి అనే విషయానికి వస్తే ఆమె సమంత ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి. సమంతకు శిల్పా రెడ్డికి మధ్య మంచి అనుబంధం ఉంది సమంతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ తనకు సంబంధించిన ఎలాంటి విషయాలలోనైనా శిల్పరెడ్డి సూచనలు పాటిస్తారు. విడాకుల తర్వాత శిల్పరెడ్డి సమంత వెంట ఉండి తనకు ఎంతో ఓదార్పును కల్పించిన విషయం తెలిసిందే.

Also Read: RRR Fans: తరలిపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కారణమెంటీ?