Vijay Devarakonda Wedding: ఎల్లుండి ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) జంట మూడు మూళ్ళ బంధం తో వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ లో ఈ జంట నిన్ననే అడుగుపెట్టింది. వీళ్ళతో పాటు బంధువులు కూడా ఎంట్రీ ఇచ్చేసారు. నేడు మెహందీ ఫంక్షన్ జరగబోతుంది. అంతకంటే ముందు వీళ్లంతా కలిసి సరదాగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో క్రికెట్ ఆడడం , అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా , అది బాగా వైరల్ అవ్వడం వంటివి జరిగాయి. ఇలా మూడు రోజుల పాటు వీళ్లిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో విజయ్ దేవరకొండ విర్జీనియా అనే అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉండేవాడు . సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందే ఆమె తో ఈయన ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చూపులు మూవీలో కూడా ఆమె ఒక చిన్న పాత్రలో కన్పిస్తుంది. ఈమె బెల్జియం కి చెందిన మోడల్ అట. కేవలం విజయ్ దేవరకొండ తోనే కాదు , ఈమె విజయ్ దేవరకొండ కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉండేది. చాలా బాగా ఉండేవాళ్ళు కానీ , నోటా మూవీ సమయం లో వీళ్ళ మధ్య అభిప్రాయా బేధాలు వచ్చి విడిపోవాల్సి వచ్చింది. విడిపోయినప్పటికీ కూడా ఆమెతో స్నేహం గానే ఉంటున్నాడట విజయ్ దేవరకొండ. ఎల్లుండి రష్మిక తో జరగబోతున్న పెళ్ళికి కూడా ఆమెని ఆహ్వానించాడట. మరి ఆమె ఈ వివాహానికి వస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వస్తే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది అనుకోవచ్చు.
ఇది కాసేపు పక్కన పెడితే , రష్మిక కూడా విజయ్ దేవరకొండ తో ప్రేమకు ముందు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమాయణం నడిపింది. వీళ్లిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , గీత గోవిందం మూవీ షూటింగ్ పూర్తి అవ్వగానే వీళ్లిద్దరి నిశ్చితార్థం బ్రేక్ అయ్యింది . అప్పటి నుండి ఇప్పటి వరకు రష్మిక రక్షిత్ శెట్టి గురించి ఏమి మాట్లాడలేదు కానీ , రక్షిత్ శెట్టి మాత్రం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ , రష్మిక జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు . రీసెంట్ రక్షిత్ శెట్టి స్నేహితుడు ఒక ఇంటర్వ్యూ లో రష్మిక , విజయ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆమె మమ్మల్ని పెళ్ళికి ఆహ్వానించలేదు , ఒకవేళ పిలిచుంటే వెళ్ళేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు.