చిరంజీవితో వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ అదరనుందట..!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తీస్తున్న ‘ఆచార్య’షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ఇల్లందులో షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని ఫొటోలు బయటకు వచ్చి హల్ చల్ చేశారు. ఇందులో రామ్ చరణ్ కూడా ఉండడంతో సినిమా మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. సామాజిక కోణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ‘ఆచార్య’పై మరో న్యూస్ వైరల్ అవుతోంది. చిరంజీవి […]

Written By: NARESH, Updated On : March 15, 2021 8:52 pm
Follow us on

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తీస్తున్న ‘ఆచార్య’షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ఇల్లందులో షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని ఫొటోలు బయటకు వచ్చి హల్ చల్ చేశారు. ఇందులో రామ్ చరణ్ కూడా ఉండడంతో సినిమా మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. సామాజిక కోణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ‘ఆచార్య’పై మరో న్యూస్ వైరల్ అవుతోంది.

చిరంజీవి సినిమా అంటే నవరసాలు పండిస్తారు దర్శకుడు. యాక్షన్ తో పాటు కామెడీని కూడా ఉండేట్లు చూస్తారు. గతంలో చిరంజీవి పూర్తిగా కామెడీ ఉన్న సినిమాలు చేశారు. అవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే కొన్ని సినిమాల్లో ఆయనకు తగ్గ కమెడియన్ ను సెట్ చేసి నవ్వులు పూయించారు. సాధారణంగా చిరుతో ఎక్కువగా బ్రహ్మానందం కామెడీ పండించారు. ప్రస్తుతం లేటెస్ట్ గా కొందరు కమెడియన్లు తమ టాలెంట్ ను చూపించడంతో వారినే ఎక్కువగా వాడుతున్నారు.

ఈనేపథ్యంలో ‘ఆచార్య’ సినిమాలో వెన్నెల కిశోర్ ను ప్రధాన కమెడియన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. వెన్నెల కిశోర్, చిరుల మధ్యసాగే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందట. ఈ విషయం లీకవడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే కథ పరంగా బలంగా ఉందని నమ్ముతున్న సినీ ప్రేక్షకులు కామెడీ కూడా ఉంటుందని తెలియడంతో సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్ పెట్టుకుంటున్నారు. మరి థియేటర్లకొచ్చేసరికి ఆచార్య ఏ విధంగా కామెడీ పండిస్తాడో చూడాలి.