ఖాకీ చొక్కా‌ ‌వేస్తున్న మరో మెగా హీరో

ఏ ఇండస్ట్రీలో అయినా పోలీస్‌ స్టోరీస్‌, పోలీసు పాత్రలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఖాకీ చొక్కా వేసుకొని పవర్ఫుల్‌ పోలీసుగా కనిపించాలని హీరోలు కోరుకుంటారు.ఈ మధ్య హీరోయిన్లు కూడా తెరపై లాఠీలు పట్టుకుంటున్నారు. తెలుగులో పోలీసు కథలు చాలానే వచ్చాయి. పేరున్న హీరోలందరూ ఎప్పుడో ఒకసారి ఖాకీ చొక్క వేసుకున్నారు. మెగా కాంపౌండ్‌లో అయితే మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ తో పాటు రామ్‌ చరణ్, సాయి ధరమ్‌ తేజ్, అల్లు అర్జున్‌‌ ఇప్పటికే పోలీసు పాత్రలు […]

Written By: Neelambaram, Updated On : August 27, 2020 7:51 pm
Follow us on


ఏ ఇండస్ట్రీలో అయినా పోలీస్‌ స్టోరీస్‌, పోలీసు పాత్రలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఖాకీ చొక్కా వేసుకొని పవర్ఫుల్‌ పోలీసుగా కనిపించాలని హీరోలు కోరుకుంటారు.ఈ మధ్య హీరోయిన్లు కూడా తెరపై లాఠీలు పట్టుకుంటున్నారు. తెలుగులో పోలీసు కథలు చాలానే వచ్చాయి. పేరున్న హీరోలందరూ ఎప్పుడో ఒకసారి ఖాకీ చొక్క వేసుకున్నారు. మెగా కాంపౌండ్‌లో అయితే మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ తో పాటు రామ్‌ చరణ్, సాయి ధరమ్‌ తేజ్, అల్లు అర్జున్‌‌ ఇప్పటికే పోలీసు పాత్రలు చేశారు. ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కూడా ఖాకీ చొక్క వేయనున్నాడు. అతను పవర్ఫుల్‌ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. దర్శకుడు సాగర్ చంద్రతో వరుణ్‌ తేజ్‌ ఇది వరకే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ఒప్పుకున్నాడు. గతంలో ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలు తీసిన సాగర్.. మెగా హీరో కోసం ఓ రొమాంటిక్ పోలీస్‌ స్టోరీని సిద్ధం చేశాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. వరుణ్‌ రీసెంట్‌గా ‘గద్దలకొండ గణేష్‌’తో భారీ హిట్‌ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ కంటే ముందే సాగర్ చంద్ర ఈ కథ రెడీ చేసి వరుణ్‌ను అప్రోచ్‌ అయ్యాడట. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కనబెట్టారని సమాచారం.

Also Read: నితిన్‌ సినిమాకు లెడీ విలన్‌ దొరికనట్టేనా?

ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్పోర్ట్స్‌ డ్రామా మూవీ చేస్తున్నాడు. ఇది వరుణ్‌కు పదో చిత్రం. దీని ద్వారా కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు వెంకటేశ్‌, సిద్దు ముద్దా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం వరుణ్‌ అమెరికాలో బాక్సింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. కథ, కథనం అన్నీ రెడీగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. తొందర్లోనే దీన్ని పట్టాలెక్కించాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడితో ఎఫ్‌2 సీక్వెల్‌లో వరుణ్‌ నటించాల్సి ఉంది. అయితే, మరో హీరో వెంకటేశ్‌తో పాటు డైరెక్టర్ అనిల్‌ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో సీక్వెల్‌ కొంత ఆలస్యంగా ప్రారంభం కానుంది. దాంతో, కిరణ్ కొర్రపాటి డైరెక్ట్‌ చేసే స్పోర్ట్స్‌ డ్రామా పూర్తయిన వెంటనే సాగర్ చంద్ర ప్రాజెక్టు మొదలు పెట్టాలని వరుణ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. దీన్ని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్పై నిర్మించనున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ పవర్ఫుల్‌ పోలీసుగా కనిపిస్తాడని, అదే టైమ్‌లో ఇది రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైన్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.