మెగా అల్లుడి డబ్ల్యూ ఫీలిం.. ఓటీటీలో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న బ్యాక్ గ్రౌండ్ మరే ఫ్యామిలీకి లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసులుగా దాదాపు డజను మంది హీరోలు ఇప్పటికే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. మరింత మంది ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే వీరంతా తమకంటూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో రాణిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ‘ఉప్పెన’ మూవీతో గ్రాండ్ అభిమానుల ముందు గ్రాండ్ ఎంట్రీ […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 7:22 pm
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న బ్యాక్ గ్రౌండ్ మరే ఫ్యామిలీకి లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసులుగా దాదాపు డజను మంది హీరోలు ఇప్పటికే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. మరింత మంది ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే వీరంతా తమకంటూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో రాణిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ‘ఉప్పెన’ మూవీతో గ్రాండ్ అభిమానుల ముందు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న వైష్ణవ్ తేజ్ ఆశలు లాక్డౌన్ కారణంగా గల్లంతైనట్లు కన్పిస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా థియేటర్లు ఇప్పట్లో మొదలయ్యేలా కన్పించకపోవడంతో ‘ఉప్పెన’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

‘ఉప్పెన’ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ‘రంగస్థలం’ దర్శకుడు సుకుమార్ వద్ద బుచ్చిబాబు పని చేశాడు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వైష్ణవ్ తేజ్ కు మెగా బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో అతడి డబ్ల్యూ మూవీకే 25కోట్ల మేర బడ్జెట్ నిర్మాతలు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కన్పించకపోవడంతో అందరిచూపు ఓటీటీలపై పడింది. భారీ బడ్జెట్లో నిర్మించిన పలు చిత్రాలు సైతం ఓటీటీలో రిలీజవుతుండటం విశేషం. ఈనేపథ్యంలో ‘ఉప్పెన’ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ లేదా అమెజాన్ ప్రైమ్ లో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన కొత్తభామ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఉప్పెనలో విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలను సమకూర్చాడు. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వైష్ణవ్ తేజ్ డబ్ల్యూ మూవీ ఓటీటీలో నేరుగా రిలీజవుతుండటంతో మెగా అభిమానుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. మెగా సపోర్ట్ వైష్ణవ్ కు ఎంత ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ చిత్రం ఓటీటీలో రిలీజవుతుందా? లేక థియేటర్లలో రిలీజవుందా? అనేది వేచి చూడాల్సిందే..!