మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ఉప్పెన. ఈ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేశాయి. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ రిలీజ్ తేదిని వాయిదా వేసుకున్నారు. తాజాగా ‘ఉప్పెన’ మూవీని మే7 రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. మే7న అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. దీంతో ఉప్పెన మూవీని కూడా ఆ తేదినే రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తుంది.
‘ఉప్పెన’ మూవీని నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించాడు. గతంలో సుకుమార్ దగ్గర బుచ్చిబాబుసాన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. వైష్ణవ్ తేజ్ కు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
‘ఆర్య’ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా ‘ఉప్పెన’ చిత్రాన్ని ఆయన శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేశారు. దీంతో బన్నీకి కలిసొచ్చిన తేదినే వైష్ణవ్ తేజ్ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ సోదరుడు సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా మారి ‘ఉప్పెన’లా రాబోతున్నాడు. ఈ సినిమాకు వైష్ణవ్ తేజ్ కు ఎలాంటి విజయం అందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.