Homeజాతీయ వార్తలుArnab Goswami On Modi: మోడీ ధీరత్వాన్ని మెచ్చుకున్న అర్నబ్ గోస్వామి.. ఆ రాత్రి ఏం...

Arnab Goswami On Modi: మోడీ ధీరత్వాన్ని మెచ్చుకున్న అర్నబ్ గోస్వామి.. ఆ రాత్రి ఏం జరిగిందో బయటపెట్టాడిలా

Arnab Goswami On Modi: ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పడింది. చాలావరకు ఉగ్రవాద స్థావరాలను కోల్పోయింది. ఉగ్రవాదులు కూడా బతుకు జీవుడా అనుకుంటూ, ప్రాణాలు అరచేతులో పెట్టుకొని పారిపోయారు. అంతేకాదు పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ తయారీ కేంద్రాలకు దగ్గరగా భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ భారీగానే నష్టపోయింది. చివరికి ఎయిర్ బేస్ లపై దాడులు జరగడంతో దాయాది దేశానికి నోరు మెదపని పరిస్థితి ఏర్పడింది.

ఇక్కడితోనే భారత్ ఆగిపోలేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సరికొత్త మిస్సయిల్స్ భారత్ చేసిన దాడులు ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. 100% స్ట్రైక్ రేట్ తో ఇండియన్ మిసైల్స్ దాడులు చేయడం అమెరికా వంటి దేశానికి సైతం షాక్ కలిగించింది. చైనా అయితే.. మూర్చ పోయింది… ఇజ్రాయిల్ వంటి దేశాలు కూడా భారత్ చూపించిన పోరాటపటిమను సరికొత్తగా మెచ్చుకున్నాయి. ఇటీవలి యుద్ధంలో కూడా భారత్ అనుసరించిన విధానాన్ని ఇజ్రాయిల్ కొనసాగించింది..

ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు భారత్ పాకిస్తాన్ మీదకి ఉపయోగించిన మిసైల్స్ ఖచ్చితమైన లక్ష్యంతో దూసుకుపోయాయి. ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. కొంచెం కూడా ప్రాణ నష్టం జరగకుండా.. ఉగ్రవాదుల ఆనుపానులు మాత్రమే ధ్వంసమయ్యాయి. అది కూడా రాత్రిపూట ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల ముష్కరులు తమ స్థావరాలను మొత్తం కోల్పోయారు. ఏ మాత్రం లేకుండా భారత్ ఇలా దాడులు చేయడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.. అమెరికా కూడా భారత్ దాడులను అంతర్గతంగా మెచ్చుకుంది.

ఈ దాడులు చేసేందుకు భారత్ బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉపయోగించింది.. ఇంతవరకు ఈ విషయాన్ని భారత్ బయట పెట్టలేదు. రిపబ్లిక్ టీవీ చైర్మన్, సుప్రసిద్ధ జర్నలిస్ట్ అర్ణబ్ గో స్వామి ఈ విషయాన్ని బయటపెట్టారు. రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు.. ఓపీఎస్ జరుగుతున్నప్పుడు భారత్ దాయాది మీదకి 19 బ్రహ్మోస్ మిస్సైల్స్ ప్రయోగించిందని ఆయన పేర్కొన్నారు. బలమైన రాజకీయం వల్లే ఇదంతా సాధ్యమైందని.. నరేంద్ర మోడీ ఇదంతా చేశారని అర్నబ్ వ్యాఖ్యానించారు.

Republic Summit 2026: Arnab Goswami, Founder & Editor-in-Chief | Great Power India, Nation First

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version