spot_img
Homeఎంటర్టైన్మెంట్మానవత్వం చూపుతున్న మెగా కోడలు

మానవత్వం చూపుతున్న మెగా కోడలు


కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత భయపెట్టినా కొంతలో కొంత మేలు చేస్తోంది.ప్రజల మధ్య సంఘీభావం పెంచు తోంది. ఒకరికి ఒకరు తోడుండాలి అన్న నిత్య సత్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది. ఉన్నోడికి లేనోడి భాద అర్ధమయ్యేలా చేసింది. ఇంకా చెప్పాలంటే నిద్రపోతున్న మానవత్వాన్ని మేల్కొలిపింది. మన చుట్టూ ఉన్న వాళ్లలో అంతర్లీనంగా ఉన్న సేవా గుణం ఇప్పుడు బయటికి వస్తోంది. దాంతో ఇతరులకు తమ చేతనైనంత, చేయగలిగినంత సాయం చేస్తున్నారు. మానవ సమాజం బలంగా సంఘటిత మౌతోంది. నిత్యాన్న దానం చేస్తున్న మహానుభావులు ఇపుడు చాలా మంది తయారయ్యారు. అనిశ్చిత గృహ నిర్బంధం మానవ సంబంధాలకు వారధి అయ్యింది. ఎన్నో మంచి పనులు చేయిస్తోంది.

లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నరోజువారీ సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ ‘ ( సి సి సి ) ఏర్పాటైంది. మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు తారలు , నిర్మాతలు , దర్శకులు ,సాంకేతిక నిపుణులు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. సుమారు 7 కోట్ల పైనే విరాళాలు పోగయ్యాయి. ఇపుడా డబ్బుని రోజువారీ సినీ కార్మికుల నిత్యావసరాల కోసం వెచ్చించ బోతున్నారు . దానిలో కొంత ఆర్ధిక సాయం కూడా ఉంటుందట ..ఇవన్నీ ఒకెత్తు అయితే చిరంజీవి కోడలు , రాంచరణ్ భార్య అయిన ఉపాసన కొణిదెల ఒక సంచలన నిర్ణయం తీసుకొంది. తాను డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న అపోలో హాస్పిటల్స్ కి సంబందించిన ఫార్మసీ లలో సినీ రంగానికి చెందిన దినసరి కార్మికులకు ఉచితంగా మందులు ఇచ్చేందుకు సంకల్పించింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version