మహేష్ బాబుకు అనుకోని అవాంతరం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”సర్కారు వారి పాట”.  అయితే ఈ సినిమాని  ఎక్కువ భాగం ఇండియాలోనే షూట్ చేస్తారని సమాచారం. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిం చను న్నారు. ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మే లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ కరోనా లాక్ డౌన్ కారణంగా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే ఈ చిత్రాన్ని జనవరి నుంచి […]

Written By: NARESH, Updated On : November 24, 2020 12:27 pm
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”సర్కారు వారి పాట”.  అయితే ఈ సినిమాని  ఎక్కువ భాగం ఇండియాలోనే షూట్ చేస్తారని సమాచారం. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిం చను న్నారు. ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మే లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ కరోనా లాక్ డౌన్ కారణంగా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే ఈ చిత్రాన్ని జనవరి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read: సినిమా సడలింపులు సరే.. టికెట్ రేటు తగ్గించరా.?

ముందుగా ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేయా లని ప్లాన్ చేసుకున్నారట. అయితే ఇప్పుడు మాత్రం ఇండియాలో ఎక్కువ భాగం షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ఇందుకోసం ‘సర్కారు వారి పాట’ సినిమా సెకాండ్ ఆఫ్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నారట. ఇండియాలో ఎక్కువ భాగం.. అమెరికాలో తక్కువ భాగం షూటింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ బాబు ఈ మూవీలో డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ లో చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మహేష్ మాసీ లుక్ లో కనిపించాడు.

Also Read: ‘అంటే సుందరానికి’పై నాని హడావుడి ఎందుకు?

‘సర్కారు వారి పాట’ పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచ నాలే ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూ ర్చను న్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్