ఓటీటీలో ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం..?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెరపైకి వచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ మూవీతో ఉదయ్ కిరణ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తర్వాత వచ్చిన ‘నువ్వు..నేను’, ‘మనంత నువ్వే’ సినిమాలు కూడా భారీ విజయం సాధించాయి. దీంతో ఉదయ్ కిరణ్ తొలి హ్యట్రిక్ హీరోగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ […]

Written By: Neelambaram, Updated On : June 26, 2020 12:49 pm
Follow us on


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెరపైకి వచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ మూవీతో ఉదయ్ కిరణ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తర్వాత వచ్చిన ‘నువ్వు..నేను’, ‘మనంత నువ్వే’ సినిమాలు కూడా భారీ విజయం సాధించాయి. దీంతో ఉదయ్ కిరణ్ తొలి హ్యట్రిక్ హీరోగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

వరుస విజయాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరుస ప్లాపులతో వెనుకబడ్డాడు. 2003లో చిరంజీవి కూతురు సుస్మితతో నిశ్చితార్థం జరిగినా కొన్ని కారణాల వల్ల పెళ్ళివరకు వెళ్లలేదు. ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను ఉదయ్ కిరణ్ వివాహమాడాడు. అయితే ఉన్నట్టుండి ఉదయ్ కిరణ్ 2014 జనవరి 6న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం శోచనీయంగా మారింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య టాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి.

ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం మరోసారి తెరపైకి వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా దిల్ బెచారాను హాట్ స్టార్ ప్లస్ డిస్నీ కొనేసింది. ఈ చిత్రం జులై 24న ఈ సినిమా ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. దీంతో ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’ ఓటీటీ విడుదల చేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. 2015 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అప్పట్లో ప్రకటించింది. ఉదయ్ కిరణ్ చనిపోయి ఆరేళ్లు గడిచినా ఈ చిత్రం రిలీజ్ కాలేదు.

చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!

లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’ సినిమా కూడా ఓటీటీలో త్వరలో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు మోహన్ ఎఎల్ఆర్ కె ‘చిత్రం చెప్పిన కథ’ను యాక్షన్ థిల్లర్ గా తెరకెక్కించారు. ఉదయ్ కిరణ్ కు జోడీగా మదలస శర్మ నటించింది. ఈ చిత్రానికి మున్నా నిర్మించగా సంగీతాన్ని మన్నా కాశి అందించాడు.

ఉదయ్ కిరణ్ ఆఖరి సినిమా కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చూస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం త్వరలో రిలీజ్ కానుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.