Bigg Boss 7 Telugu: స్ట్రాటజీ మార్చిన టాప్ కంటెస్టెంట్స్ శివాజీ-ప్రశాంత్… ఇలా చేస్తారని అసలు ఊహించలేదు!

శివాజీ, యావర్, ప్రియాంక పోటీ పడ్డారు. శోభ శెట్టి, పల్లవి ప్రశాంత్ సంచాలకులుగా వ్యవహరించారు. అయితే గేమ్ ఆడే సమయంలో ' నువ్వు మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ అవుతుంది.

Written By: NARESH, Updated On : November 17, 2023 3:06 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ పాస్ గెలుచుకునేందుకు రసవత్తరంగా పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఎవిక్షన్ పాస్ అర్జున్ గెలుచుకున్నాడు. తర్వాత టాప్ 5 లో ఉన్న వాళ్ళతో పోటీ పడి గెలిస్తేనే ఎవిక్షన్ అర్జున్ సొంతం అవుతుంది అని బిగ్ బాస్ చెప్పారు. అయితే మొదటి టాస్క్ లో అర్జున్ తో యావర్ పోటీ పడగా .. యావర్ గెలిచాడు. ఆ తర్వాత జరిగిన రెండు టాస్కుల్లో కూడా యావర్ విజయం సాధించాడు. ఇక చివరిగా విల్లు పై బాల్స్ నిలబెట్టే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

ఇందులో శివాజీ, యావర్, ప్రియాంక పోటీ పడ్డారు. శోభ శెట్టి, పల్లవి ప్రశాంత్ సంచాలకులుగా వ్యవహరించారు. అయితే గేమ్ ఆడే సమయంలో ‘ నువ్వు మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ అవుతుంది.. మాట్లాడకు ప్రశాంత్ అంటూ శివాజీ ప్రశాంత్ పై చిరాకు పడ్డాడు.కాసేపటికి బాలన్స్ కోల్పోయి టాస్క్ లో ఓడిపోయిన శివాజీ .. ‘ నీది అసలు డిస్టర్బెన్స్ గా ఉంది రా .. మాట్లాడొద్దు అంటే వినవు.. సైగలు చేస్తావ్… ఏదైనా ఉంటే గేమ్ అయిపోయినాక చెప్పొచ్చుగా అంటూ శివాజీ ప్రశాంత్ పై మండి పడ్డాడు.

ఇక యావర్ ఎక్కువ సేపు బ్యాలెన్స్ చేయడంతో .. యావర్ గెలిచాను అని అనుకోని శివాజీ ని హాగ్ చేసుకున్నాడు. శివాజీ కూడా యావర్ గెలిచాడని సంతోష పడ్డాడు. ఆ సమయంలో ప్రశాంత్ ని కూడా దగ్గరకు రమ్మని శివాజీ పిలిచాడు. కానీ ప్రశాంత్ నేను రాను అన్న .. అంటూ మొండికేశాడు. ‘ రా రా .. పిచ్చోడా .. ఇప్పుడు ఏమైంది అంటూ శివాజీ బ్రతిమాలాడు.

శివాజీ ఎంత పిలిచినా కూడా ప్రశాంత్ వెళ్ళలేదు. ‘ నేను ఇప్పుడు రానన్నా .. గేమ్ అయిపోయాక వస్తాను. అయినా నేనెందుకు మీ గేమ్ డిస్టర్బ్ చేస్తాను. ఇంకా యావర్ అవుట్ అవుతాడేమో అని జాగ్రత్తలు చెప్పను అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో శివాజీ, ప్రశాంత్ మధ్య జరగడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇది ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన తో మొదటి సారి ప్రశాంత్, శివాజీకి ఎదురుతిరిగి మాట్లాడినట్లయింది.