Annapoorna Amma: ఎయిడ్స్ ఉందని తెలిసి ఆ పని మానేసారట: అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు

సినిమాలు తగ్గించినా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అన్నపూర్ణమ్మ. మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లకు ఈ మధ్య ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Written By: Swathi, Updated On : June 28, 2024 12:45 pm

Annapoorna Amma

Follow us on

Annapoorna Amma: టాలీవుడ్ లో అమ్మ పాత్రలు చేయాలంటే ఏకంగా మూడు తరాలకు బెస్ట్ ఛాన్స్ గా ఉన్నారు అన్నపూర్ణమ్మ. 700 సినిమాల్లో నటించి గ్లామర్ బామ్మ, అందాల అమ్మమ్మ అంటూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబుకు భార్యగా నటించింది అన్నపూర్త. కానీ ఈయనకే తల్లిగా ఎన్నో సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఎంతో మంది స్టార్ హీరోలకు అమ్మగా నటించారు ఈమె. ఆ తర్వాత జనరేషన్‌కు బామ్మగా వందల చిత్రాల్లో కనిపించింది.

సినిమాలు తగ్గించినా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అన్నపూర్ణమ్మ. మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లకు ఈ మధ్య ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన కెరీర్ వ్యక్తిగత విషయాలు, పరిశ్రమలో ఎదుర్కొన్న కష్టాలు, ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని ఘటనల గురించి ప్రేక్షకులతో చెబుతుంటుంది. ఏ విషయమైనా సరే కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా అలాంటి వ్యాఖ్యలే చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన ఆమె.. తప్పు అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదని, ఇద్దరికీ ఇష్టం ఉండాలని తెలిపారు. ప్రతిరంగంలోనూ మహిళలు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారని.. కానీ కుటుంబం, పరువు, మర్యాదలు అనే వాటిని గుర్తుంచుకుంటున్నారని అన్నారు. ప్రలోభాలకు లొంగకుండా మహిళలు తప్పించుకుంటున్నారు మహిళలు అని పేర్కొన్నారు. అయితే అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కష్టాలు తప్పవని కానీ ధైర్యంగా నిలబడాలని సూచించారు అన్నపూర్ణమ్మ.

తనను కూడా అవకాశం ఇస్తే మాకు ఏంటి అని అడిగారాట. అందుకే 20 సంవత్సరాలకే పెళ్లి చేసుకుని, 25 ఏళ్లకే అమ్మ క్యారెక్టర్లు చేశాను అని కుండబద్దలు కొట్టారు. తల్లి పాత్రల వల్ల వేధింపులు తగ్గాయని గుర్తు చేసుకున్నారు. షూటింగ్ కోసం ఎక్కడో తిరిగేవాళ్లమని, ఎక్కడో స్టే చేసేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో అర్ధరాత్రి 2 గంటలకు కూడా కొందరు కక్కుర్తిగాళ్లు మా రూమ్ తలుపులు కొట్టేవారని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తర్వాతనే ఈ ఘటనలు తక్కువ అయ్యాయి అన్నారు. ఎవరికి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో అని బయపడేవారట. కొన్ని ఎందుకు జరుగుతాయో కారణాలు తెలియదని.. వాటి వల్ల మంచి చెడు రెండూ ఉంటాయన్నారు అన్నపూర్ణమ్మ.