SBI PO Recruitment 2026: గ్రాడ్యుయేట్లకు బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్కు అరుదైన అవకాశం ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరింది. మొత్తం 1,500 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే 11 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ రోజు(బుధవారం)రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది యువ గ్రాడ్యుయేట్లకు బ్యాంకింగ్ సెక్టార్లో మంచి కెరీర్ ఇస్తుంది .
అర్హతలు ఇవీ..
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు వయసు సడలింపు వర్తిస్తుంది. ఇంజనీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఏ బ్రాంచ్ అయినా డిగ్రీ ఉంటే చాలు.
దరఖాస్తు ఫీజు..
సాధారణ వర్గాలకు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు పూర్తిగా మినహాయింపు ఉంది. ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మంచి సౌకర్యం కల్పిస్తుంది.
జీతం, ఇతర ప్రయోజనాలు..
ఎంపికైన వారికి నెలకు దాదాపు రూ.లక్ష వరకు జీతం లభిస్తుంది. ఇందులో బేసిక్ పే, డీఏ, హౌస్ రెంట్ అలవెన్స్ వంటివి ఉంటాయి. దీంతో పాటు మెడికల్ ఫెసిలిటీలు, లోన్స్, పెన్షన్, ఉద్యోగ భద్రత వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎస్బీ ఐలో పీవో గా చేరిన తర్వాత కెరీర్లో వేగంగా పైకి రావచ్చు. ఇది ప్రైవేట్ సెక్టార్లోని చాలా ఉద్యోగాల కంటే స్థిరత్వం ఇస్తుంది.
పోటీ ఎక్కువ..
ఈ అవకాశం చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, పోటీ అత్యంత తీవ్రంగా ఉంది. 1,500 పోస్టులకు 11 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం అంటే ప్రతి పోస్టుకు సుమారు 733 మంది పోటీ పడుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో విజయం సాధించాలంటే కేవలం దరఖాస్తు చేసుకోవడం సరిపోదు.
మూడు దశల్లో పరీక్ష..
పీవో పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ దశలను దాటాలంటే రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ వంటి వాటిలో బలమైన పునాది అవసరం. చాలా మంది గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు ఎందుకంటే సిద్ధం లేకుండా దరఖాస్తు చేసుకుంటారు.
చివరి క్షణంలో దరఖాస్తు చేసుకునేవారు సర్వర్ సమస్యలు, పేమెంట్ ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఎక్కువ. కాబట్టి వీలైనంత త్వరగా దరఖాస్తు పూర్తి చేయండి. ఈ అవకాశం కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. అర్హత ఉన్న వారందరూ ఈ రోజే దరఖాస్తు చేసుకోండి.
