Rajamouli: రాజమౌళి తో సినిమా చేసి కెరియర్ ను కోల్పోయిన టాలీవుడ్ స్టార్ హీరో లు వీళ్లే…

రాజమౌళికి ఈ సినిమాతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ లు అయితే దక్కుతుందనే చెప్పాలి...కానీ రాజమౌళి వల్ల ఒక ఇద్దరు హీరోలు వాళ్ళ కెరియర్ ని కోల్పోవాల్సి వచ్చిందనే విషయం మనలో చాలామందికి తెలియదు.

Written By: Gopi, Updated On : April 6, 2024 9:41 pm

Rajamouli

Follow us on

Rajamouli: తన ప్రతిభతో వరుస సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిపి, తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి..ఈయన చేసిన మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు కావడం విశేషం… అయితే ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి వాటిని అందుకోవడానికి రాజమౌళి ఈ సినిమా మీద తీవ్రమైన కసరత్తులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళికి ఈ సినిమాతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ లు అయితే దక్కుతుందనే చెప్పాలి…కానీ రాజమౌళి వల్ల ఒక ఇద్దరు హీరోలు వాళ్ళ కెరియర్ ని కోల్పోవాల్సి వచ్చిందనే విషయం మనలో చాలామందికి తెలియదు. వాళ్ళు ఎవరు అంటే నితిన్, సునీల్… మొదటగా నితిన్ రాజమౌళితో సై సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దాంతో పాటుగా నితిన్ కి కూడా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది.

ఇక ఎప్పుడైతే ఈ సినిమా వచ్చిందో ఆ తర్వాత నుంచి నితిన్ ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దాదాపు 14 ఫ్లాప్ సినిమాల తర్వాత విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఇష్క్ సినిమాతో ఆయన హీరోగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే సునీల్ హీరోగా, సలోని హీరోయిన్ గా వచ్చిన ‘మర్యాద రామన్న ‘ సినిమా విషయం లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అది ఏంటి అంటే సునీల్ హీరోగా చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

ఇక సునీల్ ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఈ సినిమాతో పోల్చి చూడడం వల్ల మిగతా సినిమాలు రాజమౌళి సినిమా లాగా ఉండవు కాబట్టి ఈ సినిమాలను జనాలు రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా సునీల్ కి సరైన సక్సెస్ అయితే లేదు. అందుకే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా కొనసాగుతున్నాడు…