Mahesh Babu And Rajamouli: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరో…

ఎప్పుడైతే రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ చేశాడో అప్పటినుంచి వాళ్లు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా కాదు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమానే చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : July 3, 2024 11:28 am

Mahesh Babu And Rajamouli

Follow us on

Mahesh Babu And Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇంతకు ముందు వరకు తన అభిమానులకు మాత్రం మహేష్ బాబు విషయంలో కొంత వరకు వెళితి ఉండేది. అది ఏంటి అంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మహేష్ బాబు మాత్రం ఒక తెలుగులోనే సినిమాలు చేయడం వాళ్లందరిని నిరాశకు గురిచేసింది.

ఇక ఎప్పుడైతే రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ చేశాడో అప్పటినుంచి వాళ్లు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా కాదు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమానే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికి ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇక రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ ని రెడీ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఒక్కసారి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఇక ఆగకుండా శరవేగంగా సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశ్యం తోనే రాజమౌళి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని మరి ఈ సినిమా సెట్స్ ను దగ్గరుండి మరీ రెడీ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ అయిన ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ ను విలన్ గా తీసుకుంటున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే పృధ్వీ రాజ్ సుకుమారన్ తో కూడా కొన్ని చర్చలను జరిపినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తే సినిమా గ్రాఫ్ అనేది మరికొంత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మధ్య ఆయన అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ పృథ్వి రాజ్ సుకుమారన్ పోషించిన విలన్ పాత్రకి మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక దాంతోనే రాజమౌళి ఆయనను విలన్ గా తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే రాజమౌళి సినిమాలో విలన్ అంటే ఎలాంటి కీలకపాత్ర వహిస్తాడో మనందరికీ తెలిసిందే. ఇక ఇంతకు ముందు ఈగ లో ‘సుదీప్ ‘ బాహుబలి లో ‘రాణా ‘ విలన్ గా చేసి ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే… ఇక ఆ విధంగానే ఈ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్ కూడా రెచ్చిపోయి నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటాడని ప్రతి ఒక్కరు కూడా వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.