Renu Desai
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే… అయితే ఆరు నెలల నుంచి పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతూ చాలా క్యాంపెనింగ్స్ చేస్తూ అనుక్షణం ప్రజల్లో ఉంటూ, జనలతోనే గడిపాడు. అందువల్లే తనమీద నమ్మకాన్ని పెట్టుకున్న జనం ఆయనకి బ్రహ్మరథం పట్టారు. ఇక ఇంతకుముందు ఉన్న వైసిపి గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత తో ఉన్న జనాలు ఆల్టర్నేట్ కోసం ఎన్ డి ఏ కూటమి వైపు మొగ్గు చూపారు.
ఇక అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యే గా గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు, పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలు, అలాగే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు ఈ విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన ‘రేణు దేశాయ్’ కూడా పవన్ కళ్యాణ్ విజయం పట్ల చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆమె కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు కూడా వాళ్ల నాన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు…
ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సాధించిన ఈ విజయం అనేది చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి. నిజానికి పవన్ కళ్యాణ్ ని వైసిపి ప్రభుత్వం చాలా వరకు హింసించింది. ఎలా అంటే అతన్ని ఎప్పుడు విమర్శిస్తూ దుర్భాషలాడుతూ, ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ, ఆయన సినిమాలను తొక్కేయాలని చూశారు. దానివల్లే పవన్ కళ్యాణ్ జనాల్లో స్ట్రాంగ్ అయ్యాడు. జగన్ జనాల్లో వీక్ అయ్యాడు.
అందువల్లే అధికారం ఉంది అని ఇష్టం వచ్చినట్టుగా విర్రవీగితే ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేదానికి జగన్ ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన గళాన్ని వినిపించబోతున్నాడు మరి ఆయన అసెంబ్లీ లో ఎలాంటి ప్రశ్నలను సంధిస్తాడు. ఎలాంటి వాటి మీద పోరాటం చేస్తాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే…