NTR: పబ్లిక్ లో ఫైర్ అయిన ఎన్టీఆర్… అందరూ షాక్, వీడియో వైరల్!

సెలబ్రిటీల ఫోటోలను మీడియా సంస్థలకు విక్రయించే పలువురు ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ ముంబైలో ఉన్నారు. సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ ఉండదు. కుటుంబ సభ్యులతో వెళుతున్నా, బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ తో పార్టీకి, డిన్నర్ కి వెళుతున్నా వదిలిపెట్టరు.

Written By: S Reddy, Updated On : April 26, 2024 9:04 am

NTR

Follow us on

NTR: ఎన్టీఆర్ పబ్లిక్ సహనం కోల్పోవడం చర్చకు దారి తీసింది. ఆయన గట్టిగా అరుస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?… వార్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ముంబైలో వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఇటీవల ఓ షెడ్యూల్ లో పాల్గొన్న ఎన్టీఆర్, లేటెస్ట్ షెడ్యూల్ కి హాజరయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నారు. ముంబైలో ఎక్కడికి వెళ్లినా మీడియా, ఫోటోగ్రాఫర్స్ వెనకబడతారు. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ ని దాటుకొని వెళ్లడం అతి కష్టమైన వ్యవహారం.

సెలబ్రిటీల ఫోటోలను మీడియా సంస్థలకు విక్రయించే పలువురు ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ ముంబైలో ఉన్నారు. సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ ఉండదు. కుటుంబ సభ్యులతో వెళుతున్నా, బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ తో పార్టీకి, డిన్నర్ కి వెళుతున్నా వదిలిపెట్టరు. తాజాగా ఓ ఫోటో గ్రాఫర్ ఎన్టీఆర్ ని విసిగించాడు. ఎన్టీఆర్ ఫోన్ మాట్లాడుతూ తన హోటల్ రూమ్ కి వెళుతుండగా వెనుకబడి ఇరిటేట్ చేశాడు.

ఆగ్రహానికి గురైన ఎన్టీఆర్ ‘ఓయ్’ అని గట్టిగా అరిచాడు. అతని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అంతగా కోప్పడడానికి కారణం ఆయన లుక్ రివీల్ కావడమే అని తెలుస్తుంది. వార్ 2 చిత్రం కోసం ఎన్టీఆర్ సరికొత్త లుక్ ట్రై చేస్తుండగా మీడియా వలన అది లీక్ అవుతుంది. ఈ కారణంగానే ఎన్టీఆర్ అసహనానికి గురయ్యాడని సమాచారం. ఇక వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. హృతిక్ రోషన్ మరొక హీరోగా నటిస్తున్నాడు.

మరోవైపు దేవర షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం అక్టోబర్ 10న విడుదల చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జంటగా నటిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు.