Prashanth Neel: ప్రశాంత్ నీల్ పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ఎదగడానికి కారణం ఏంటో తెలుసా..?

ప్రశాంత్ నీల్ కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రస్తుతం ఇండియా లోనే అన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదగడం అనేది నిజంగా ఒక గ్రేట్ విషయం అనే చెప్పాలి.. ప్రస్తుతం ఆయన ముందు ఉన్న టార్గెట్ ఏంటి అంటే ఆయన చేయబోయే 'సలార్ 2' సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టడమే.. ఇక ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మరొక భారీ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు.

Written By: Gopi, Updated On : July 26, 2024 3:34 pm

Prashanth Neel

Follow us on

Prashanth Neel: సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతుంది. అయితే వాళ్ళు చేసిన సినిమాల ద్వారా గాని, వాళ్లు సాధించే సక్సెస్ ల ద్వారా గాని వాళ్ళకున్న ఈ క్రేజ్ అనేది జనాల్లో విపరీతమైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది…లైమ్ లైట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్టార్ హీరోలు సైతం పోటీ పడుతూ ఉంటారు. వాళ్లతో సినిమాలు చేయడం వల్ల వీళ్ళ క్రేజ్ పెరగడమే కాకుండా మార్కెట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అందువల్లే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఎప్పుడు ఆసక్తి చూపిస్తారు. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకుల హవా నడుస్తుంది అందులో ప్రశాంత్ నీలో ఒకరు. ఇక ఈ దర్శకుడు తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఈయన తమిళ్ స్టార్ హీరో అజిత్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనే విషయం అయితే చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టును చేతిలో పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అజిత్ తో సినిమా చేసే టైం అతనికి లేదు. కాబట్టి ఇప్పుడప్పుడే అజిత్ తో సినిమా చేసే అవకాశాలు అయితే లేవు.

ప్రస్తుతం ఆయన ముందు ఉన్న టార్గెట్ ఏంటి అంటే ఆయన చేయబోయే ‘సలార్ 2’ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టడమే.. ఇక ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మరొక భారీ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. దానికోసమే విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే సలార్ 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ హీరోలందరు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మిగతా డైరెక్టర్ల కంటే కూడా ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆయన యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ గా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుడి చేత విజిల్స్ కొట్టించేలా సినిమాని తీస్తూ ఉంటాడు. అందువల్లే ఆయనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ముందుగానే స్టార్ హీరోలందరు అతనితో సినిమా చేయడానికి కమిట్ అవుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల వరకు చాలా బిజీగా ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇండియాలో రాజమౌళి తర్వాత అంతటి భారీ గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడం విశేషం…రాజమౌళి లాగే తను కూడా యాక్షన్ ఎంటర్ టైనర్లను చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నాడు…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇండియాలో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనేది వాస్తవం…