Tollywood: వైజయంతీ మూవీస్ వారు అందించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకున్నాయి. అయితే చలసాని అశ్విని దత్ 1972లో స్థాపించిన చలనచిత్ర సంస్థే ఈ వైజయంతీ మూవీస్. ఈ సంస్థ ద్వారా ఎందరో ప్రముఖ నటీనటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇలా పరిచయమై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు బిజీగా ఉన్న ఆ నటీనటులు ఎవరో చూసేద్దామా.
గంగోత్రి – అల్లు అర్జున్, అదితి అగర్వాల్
అల్లు అర్జున్, అదితి అగర్వాల్ లను తెలుగు తెరకు గంగోత్రి సినిమా ద్వారా పరిచయం చేసింది వైజయంతి మూవీస్.
ఒకటో నెంబర్ కుర్రాడు – నందమూరి తారకరత్న
నందమూరి తారకరత్న ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా ఈయన చాలా మందికి పరిచయమే. హీరోగా ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా వైజయంతి మూవీస్ తెలుగు తెరకు పరిచయం చేసింది.
ఎవడే సుబ్రహ్మణ్యం- విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్
విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ లు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు. వీరిని కూడా తెలుగు తెరకు వైజయంతి సంస్థ పరిచయం చేసింది.
రాజకుమారుడు- మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఈయనను కూడా వైజయంతి మూవీస్ తెలుగు తెరకు పరిచయం చేసింది. అయితే రాజకుమారుడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు మహేష్.
సీతారామం – మృణాల్ ఠాకూర్
నార్త్ ఇండియన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో చోటు చేసుకుంది. మృణాల్ ను తెలుగు తెరకు ఈ సినిమా ద్వారా పరిచయం చేసింది వైజయంతీ మూవీస్.
మహానటి – దుల్కర్ సల్మాన్
మలయాళ నటుడు అయినా దుల్కర్ సల్మాన్ కు తెలుగులో చాలా క్రేజ్ ఉంది. ఈయన మహానటి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈయనను కూడా తెలుగు తెరకు పరిచయం చేసింది వైజయంతీ మూవీస్.
ఇలా చాలా మంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసింది వైజయంతీ మూవీస్. ఇందులో ప్రతి ఒక్కరు కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.