Pushpa 2: పుష్ప 2 కు పోటీగా వస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…ఇలా చేస్తే ఎవరికి నష్టం..?

ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పుష్ప 2 సినిమా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Written By: Gopi, Updated On : June 11, 2024 9:44 am

Pushpa 2

Follow us on

Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి పుష్ప 2 సినిమాతో ఎవరు సాధించలేని రికార్డులను కూడా సాధించాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాలనే ప్లానింగ్ తోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారీగా నిర్వహిస్తున్నారు.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పుష్ప 2 సినిమా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా బాలీవుడ్ హీరోలు ఆ డేట్ కి రావాలనుకొని పుష్ప రాజ్ తో పోటీని తట్టుకోలేమనే ఉద్దేశ్యంతో వాళ్ళ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్నారు.

ముఖ్యంగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న ‘సింగం ఎగైన్’ అనే సినిమా మొదట ఆగస్టు 15వ తేదీన రావాలని అనుకున్నప్పటికీ పుష్ప 2 ముందు తమ సినిమా నిలబడలేదేమోననే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఆ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మరొక బాలీవుడ్ సినిమా పుష్ప 2 కి పోటీగా వస్తుంది. జాన్ అబ్రహం హీరోగా వస్తున్న వేద సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇక దీంతో పుష్ప 2 సినిమాకి పోటీగా వేద ను దింపుతున్నారు అంటూ సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇలా రెండు సినిమాలు ఒకే డేట్ కి రావడం వల్ల ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా మాత్రమే భారీ కలెక్షన్స్ ను సాధిస్తుంది. దీనివల్ల రెండు సినిమాలకు మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అనేది తెలియాలంటే ఆగస్టు 15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…